Karthika Deepam 2: దీప ఎప్పటికీ రాదు.. ఏడ్చేసిన శౌర్య!
on Apr 27, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -342 లో.. పూజ కోసం కాంచన ఏర్పాట్లు చేస్తుంటే.. కార్తీక్ వస్తాడు. కార్తీక్ షర్ట్ పై బ్లడ్ చూసి ఏంటి నాన్న అది అని శౌర్య అడుగుతుంది. దారిలో చిన్న ఆక్సిడెంట్ అని కార్తీక్ చెప్తాడు. మరి ఆ బ్యాండేజ్ ఏంటని శౌర్య అడుగుతుంది. బ్లడ్ ఇచ్చానని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత కార్తీక్ ఫ్రెషప్ అయి వచ్చాక దీప జైల్లో నుండి బయటకు రావాలని అందరు నేలపైన భోజనం చేస్తారు.
మరొకపక్క దీపకి కానిస్టేబుల్ భోజనం తీసుకొని వస్తుంది. దీప భోజనం చేస్తూ తన కూతురితో గడిపిన క్షణాన్ని గుర్తు చేసుకొని బాధపడుతుంది. ఆ తర్వాత శ్రీధర్ ఎప్పటిలాగే కావేరితో గొడవ పడుతుంటాడు. కార్తీక్, కాంచన మాట్లాడుకుంటారు. లాయర్ తో మాట్లాడు మన దగ్గరున్న సాక్ష్యాలు దీపని బయటకు తీసుకొని రాలేవని కార్తీక్ తో కాంచన అంటుంది. నిజం చెప్పావ్ అత్త అని జ్యోత్స్న వస్తుంది. నువ్వు ఎందుకు వచ్చావని జ్యోత్స్నని కార్తీక్ కోప్పడతాడు. మా డాడ్ బాగయి ఇంటికి వచ్చాడు. కానీ నీ కోడలు ఇంటికి రాదని జ్యోత్స్న చెప్తుంది. నువ్వు ఇక్కడ ఏం మాట్లాడుతున్నావ్ శౌర్య వింటుందని జ్యోత్స్నని బయటకు తీసుకొని వెళ్లి మాట్లాడతాడు కార్తీక్.
దీప ఎప్పటికి బయటకు రాదని మళ్ళీ జ్యోత్స్న అంటుంది. ఆ మాట బయట ఆడుకుంటున్న శౌర్య వింటుంది. కార్తీక్ లోపలికి వెళ్ళాక జ్యోత్స్న వెళ్తుంటే.. శౌర్య వచ్చి మా అమ్మ ఎక్కడుంది ఎందుకు రాదని అంటున్నావని అడుగుతుంది. మీ అమ్మ ఎప్పటికి రాదు అంటూ జ్యోత్స్న అంటుంటే శౌర్య ఏడుస్తుంది. కాసేపటికి జ్యోత్స్న అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
