Illu illalu pillalu : ధీరజ్ పై కోప్పడిన రామరాజు.. జీతం డబ్బుల కోసం రచ్చ!
on May 11, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-155 లో... చందు ఆఫీస్ నుండి ఇంటికి రాగానే అబ్బా వచ్చారా.. ఉదయం నుండి బోర్ కొడుతుందని శ్రీవల్లి అనగానే.. ఎందుకు ఇంట్లో అందరు ఉన్నారుగా అని చందు అంటాడు. ఉంటే మీరు లేరు కదా అని శ్రీవల్లి అంటుంది. చందు తన జీతం డబ్బు శ్రీవల్లికి ఇచ్చి.. ఇది రేపు నాన్నకి ఇవ్వాలని అంటాడు. అంత డబ్బు శ్రీవల్లి చూసి షాక్ అవుతుంది. ఇంత డబ్బు మా ఆయన ఇంట్లో వాళ్ళకి ఇస్తే ఎలా అందరు మా అయన సంపాదనతో బ్రతుకుతున్నారన్నమాట అని శ్రీవల్లి అనుకుంటుంది.
మరోవైపు నర్మద అన్న మాటలకి సాగర్ బాధపడతాడు. సాగర్ దగ్గరికి ధీరజ్ వచ్చి ఏంట్రా ఇలా ఉన్నావని అడుగుతాడు. జరిగింది చెప్పి సాగర్ బాధపడతాడు. నాన్న మిల్ లో వర్క్ ఉందని అలా చేసాడు అంతే కానీ నీ భార్యతో బయటకు వెళ్లొద్దని కాదని ధీరజ్ చెప్తాడు.
మరుసటిరోజు రామరాజుకి వేదవతి టీ ఇస్తుంది. ముగ్గురు కోడళ్ళు చాలా బాగా కలిసిపోయారంటూ మురిసిపోతు రామరాజుకి చెప్తుంది. ధీరజ్ తన నెల శాలరీ రామరాజుకి ఇవ్వాలనుకుంటాడు. మరొకవైపు చందు తన శాలరీ రామరాజుకి ఇవ్వడానికి వస్తాడు. నాకు హైదరాబాద్ లో ట్రైనింగ్ ఉందని మీ నాన్న గారికి చెప్పమని సాగర్ తో నర్మద అంటుంది. సాగర్ రామరాజుకి చెప్పడానికి వస్తాడు. అప్పుడే చందు శాలరీ ఇస్తాడు.
ఆ తర్వాత ధీరజ్ డబ్బు ఇస్తుంటే నువ్వు ఎందుకు ఇస్తున్నావని వేదవతి అంటుంది. అంటే నాకూ నా భార్య కి ఇంట్లో ఉండడానికి చోటు ఇంకా భోజనం పెడుతున్నారు కదా అని ధీరజ్ అంటాడు. దాంతో రామరాజుకి కోపం వస్తుంది.
ఇద్దరు మనుషుల తిండికి ఒక ఆరు వేలు సరిపోతాయా అని వేదవతిని రామరాజు అడుగుతాడు. వేదవతి చెప్పకపోవడంతో శ్రీవల్లిని రామరాజు అడుగుతాడు. ఎనిమిది నుండి పది వేలు అవుతాయని చెప్తుంది. మరి నువ్వు ఏ లెక్కన ఇస్తున్నావ్.. ఉద్యోగం చేస్తున్నానని పొగరు కదా అని ధీరజ్ పై కోప్పడతాడు రామరాజు.
తరువాయి భాగంలో ఇంట్లో అందరికంటే నా భర్త ఎక్కువ సంపాదిస్తున్నాడని శ్రీవల్లి అంటుంది. మా ఆయనకు జీతం ఇస్తే మీ ఆయన కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడని నర్మద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



