Illu illalu pillalu : ధీరజ్ గురించి ఇంట్లో చర్చ.. అతని కోసం ఎదురుచూస్తూ ప్రేమ!
on Jul 2, 2025

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -199 లో.....రామరాజు వాళ్లంతా రాత్రి భోజనం చేస్తుంటారు. ధీరజ్ ఇంకా ఇంటికి రాకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడని వేదవతిని రామరాజు అడుగుతాడు. నాకేం తెలియదని వేదవతి అంటుంది. నర్మద, సాగర్ కి ధీరజ్ గురించి తెలిసి ఉంటుందని శ్రీవల్లి అనగానే నర్మద, సాగర్ ఇద్దరు టెన్షన్ పడతారు. మాకేం తెలియదని సాగర్, నర్మద చెప్తారు.
మరొకవైపు ధీరజ్ గురించి గుమ్మం దగ్గరే ఎదురుచూస్తుంటుంది ప్రేమ. అదే సమయంలో వేదవతి, నర్మద మాట్లాడుకుంటుంటే.. రామరాజుకి చూపిస్తుంది శ్రీవల్లి. దాంతో అక్కడికి వచ్చిన రామరాజు.. ఏంటి ఏం మాట్లాడుకుంటున్నారు.. ధీరజ్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసా అని అడుగుతాడు. వాళ్ళు తెలియదని అంటారు. ఏమో నా వెనకాల జరుగుతుంది కానీ చెప్పట్లేదని రామరాజు అంటాడు. ఆ తర్వాత ప్రేమ దగ్గరికి వేదవతి వస్తుంది. నువ్వు మళ్ళీ మాకు తెలియకుండా ఏదైనా జాబ్ చెయ్యాలనుకుంటున్నావా ఇప్పటికే మీ మావయ్య గారు నా వల్ల ఇన్నాళ్లుగా మాటలు పడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ నీ వల్ల మాటలు పడేలా చెయ్యకని వేదవతి అంటుంది. అలాంటి ప్రయత్నం ఏం చెయ్యనని నాకు మాటివ్వు అనగానే వేదవతికి ప్రేమ మాటిస్తుంది.
మరొకవైపు ధీరజ్ డే అంతా ఫుడ్ డెలివరీ చేసి రాత్రి డ్రైవింగ్ చేస్తుంటాడు. ధీరజ్ వచ్చేసరికి ప్రేమ గుమ్మం ముందు ఉంటుంది. నాకు నిద్రొస్తుందంటూ ధీరజ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కాస్త అన్నం తినమని ప్రేమ రిక్వెస్ట్ చేస్తుంది. కానీ నాకు నిద్రొస్తుందంటూ ధీరజ్ వెళ్లి పడుకుంటాడు. అప్పుడే ధీరజ్ కాలికి ఉన్న దెబ్బని ప్రేమ చూసి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. మరొకవైపు నర్మద చెప్పినట్టు సాగర్ గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



