రాధ ఎవరనుకున్నావ్ కోహినూర్ వజ్రం..
on Jun 25, 2025
"కుక్కు విత్ జాతి రత్నాలు" షో త్వరలో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయ్యింది. ఈ షోకి హోస్ట్ గా ప్రదీప్ మాచిరాజు జడ్జెస్ గా అలనాటి అందాల నటి రాధ, మూవీస్ లో విలన్ రోల్స్ లో కనిపించే ఆశిష్ విద్యార్థి, వాహ్ చెఫ్ సంజయ్ తుమ్మ ఉండబోతున్నారు. ఇక షోలో వంటలు చేసి అలరించడానికి ఈటీవీ నటుడు ప్రభాకర్, ప్రియా, యష్మి, బాబా భాస్కర్, సుజిత, సుహాసిని, విజె సున్ని, అవినాష్, విష్ణుప్రియ, రీతూ చౌదరి, బాలు అలియాస్ విషుకాంత్ వంటి వాళ్లంతా రాబోతున్నారు. ఐతే రోజూ ఒక ప్రోమోని రిలీజ్ చేస్తూ వస్తోంది స్టార్ మా. రీసెంట్ గా ఒక ప్రోమోని రిలీజ్ చేశారు. రాధ సిగ్గు పడుతూ కూర్చుంటే ఆశిష్ విద్యార్థి డైలాగ్ వేశారు. "ప్రదీప్ ఎవరయ్యా చెప్పింది బ్రిటీషర్ లు కోహినూర్ వజ్రాన్ని తీసుకుపోయారని ..చూడు మన పక్కనే కూర్చుంది" అన్నారు.
వెంటనే ప్రదీప్ "పోకిరి సినిమాలో మహేష్ బాబును చూసి పోలీసా" అనే ఎక్స్ప్రెషన్ ఇస్తారు కదా మీరు...అలా ఈ మధ్యన మీరు ఫుడ్డుని చూసి ఫుడ్డా అని ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు" అంటూ ఆశిష్ విద్యార్థిని ఉద్దేశించి అన్నాడు. వెంటనే రాధ.. "నేను చూసాను ఆయనకు ఏదైనా ఫుడ్ నచ్చితే వేళ్ళు మొత్తం నాకేస్తారు" అంటూ చేసి మరి చూపించింది రాధ. తర్వాత "పెళ్ళికి ముందు కుకింగ్ ఎంటర్టైనింగ్ గా ఉందా పెళ్లి తర్వాత కుకింగ్ ఎంటర్టైనింగ్ గా ఉందా" అని సంజయ్ తుమ్మని అడిగాడు. "తిన్నాక తల్లి ఎం చేస్తుంది. చాల బాగా చేసావ్ రా అంటుంది. కానీ భార్య" అని చెప్పబోయేంతలో "రేపు కూడా మీరే చేయండి అంటుంది" అని ఫన్నీ డైలాగ్ వేసాడు. ఇలా ఈ షో ప్రోమో కూడా ఎంటర్టైనింగ్ గా ఉంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
