Brahmamudi : బాబుపై కావ్య చూపిస్తున్న కేరింగ్ చూసి ఇంప్రెస్ అయిన రాజ్!
on Mar 28, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -368 లో..ప్రకాష్ కావాలనే రాహుల్ ఆర్డర్ చేసిన ఫుడ్ ని వెనక్కి పంపిస్తాడు. అంతే కాకుండా ఇంట్లో ఉన్న ఫుడ్ కూడా డెలివరీ బాయ్ తో ఇచ్చి పంపిస్తాడు. అది చూసిన రాహుల్, రుద్రాణి, అనుపమ, ధాన్యలక్ష్మి అందరు అవాక్కవుతారు. ఇంట్లో అందరు బాధతో తినకుండా ఉంటే మీరు మాత్రం తింటారా? నా మతిమరుపుని అడ్డం పెట్టుకొని ఇది చేశానని ప్రకాష్ అనుకుంటాడు.
ఆ తర్వాత బాబు నిద్ర పోకుండా ఏడుస్తుంటే రాజ్ ఇబ్బంది పడుతాడు. బాబుకి పాలు మాత్రమే కాకుండా ఉగ్గు కూడా తినిపంచాలని కావ్య చెప్తుంది. అదెక్కడ దొరుకుతుందని రాజ్ అమాయకంగా అడుగుతాడు. ఆ తర్వాత కావ్య బయటకు వెళ్లి ఉగ్గు తీసుకోని వస్తానంటూ వెళ్తుంటుంది. బయటే ఉన్న కళ్యాణ్ ఎక్కడికి వదిన అని అడుగుతాడు. బాబుకి ఉగ్గు తేవడానికి అని కావ్య అనగానే.. ఇంత రాత్రి మీరెందుకు నేను వెళ్తానంటూ కళ్యాణ్ వెళ్తాడు. అదంతా అనామిక చూస్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ ఉగ్గు తీసుకొని వస్తాడు. కావ్య, కళ్యాణ్ ఇద్దరు లోపలికి వస్తుంటే.. అందరు హాల్లోనే ఉంటారు. మా ఆయనని సేవకుడిగా, బానిసగా చేస్తున్నారు.. పెద్దత్తయ్య కూడా ఎలాంటి హెల్ప్ చెయ్యద్దన్నారు కానీ మీ కోడలే మీ మాట వింటలేదని అనామిక అంటుంది. ఆ తర్వాత అనామికపై కళ్యాణ్ కోప్పడతాడు. నేనేం తప్పు చేశానని ఇంత మందిని పోగు చేసావని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత కావ్య వెళ్లి బాబుకి ఉగ్గు తినిపిస్తుంది.
బాబుని ఎత్తుకొని రాజ్ బాల్కనీలో అటు ఇటు తిరుగుతుంటే అప్పుడే కావ్య వచ్చి.. బాబుని తీసుకొని వెళ్లి ఉయ్యాలలో వేస్తుంది. కాసేపు బాబుని పడుకోపెడుతుంది. రాత్రంతా కావ్య మేల్కొని ఉండి మరీ బాబుని పడుకోపెడుతుంటే.. అది చూసిన రాజ్ ఇంప్రెస్ అవుతాడు. తరువాయి భాగంలో ప్రకాష్ దగ్గరికి సుభాష్ వచ్చి.. ఆ కాంట్రాక్ట్ ఎందుకు క్యాన్సిల్ అయిందని అడుగుతాడు. ఆ తర్వాత ఆ కాంట్రాక్ట్ వల్ల కోటి రూపాయలు లాస్ అయింది.. అది రాజ్ వల్లే అని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read