Brahmamudi : డిజైన్స్ చూపించిన కావ్య.. యామిని ఎంట్రీతో కథ మలుపు తిరగనుందా!
on May 6, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -713 లో.....అప్పు, కళ్యాణ్ ఇద్దరు కలిసి రాజ్ కి గతం గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగా రాజ్ క్లోజ్ ఫ్రెండ్ శ్వేతని రెసాట్ కి రప్పిస్తారు. నువ్వు అన్నయ్యతో ఎలా క్లోజ్ గా ఉన్నావో.. నాతో అలా క్లోజ్ గా ఉండు, అప్పుడు అన్నయ్యకి ఏమైన గుర్తుకురావొచ్చని శ్వేతతో కళ్యాణ్ చెప్తాడు. ఆ తర్వాత రాజ్, కావ్య ఇద్దరు రెసాట్ కి చేరుకుంటారు. రాజ్ ని చూసి కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు.
అందరు రాజ్ కి తమని తాము పరిచయం చేసుకుంటారు. కళ్యాణ్ ఫ్లోలో అన్నయ్య అని రాజ్ ని పిలవగానే.. అదేంటీ అలా అన్నావని రాజ్ అడుగుతాడు. మా అన్నయ్య కూడ మీలాగే ఉంటాడు. తను మా దగ్గర నుండి వెళ్ళిపోయాడు. అందుకే మిమ్మల్ని అలా పిలవాలనిపిస్తుందని కళ్యాణ్ అనగానే.. సరే తమ్ముడు అని రాజ్ అంటడు. శ్వేత, కళ్యాణ్ ఇద్దరు క్లోజ్ గా ఉండడంతో మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏదో గతం గుర్తుకు వస్తుంది కానీ గుర్తుకు రావడం లేదని రాజ్ అంటాడు. ఆ తర్వాత రాజ్ , కళ్యాణ్ లకి ఒక రూమ్ అప్పు, కావ్యలకి రూమ్ తీసుకుంటారు. మరొకవైపు రెసాట్ కి యామిని వస్తుంది. ఆ తర్వాత కావ్య దగ్గరికి శృతి వచ్చి డిజైన్స్ ఇస్తుంది. ఆ డిజైన్స్ ద్వారా అయిన రాజ్ కి గతం గుర్తుకువస్తుందేమోనని కావ్య అనుకుంటుంది.
కళ్యాణ్ ప్లాన్ లో భాగంగా రాజ్ దగ్గరికి వచ్చి.. అన్నయ్య ఈ రూమ్ లో వాటర్ రావడం లేదు. మీరు వదిన వల్ల రూమ్ లో స్నానం చెయ్యండి అని కళ్యాణ్ చెప్పగానే.. రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. రాజ్ కావ్య దగ్గరికి వెళ్లి తన మనసులో మాట చెప్పినట్లు ఉహించుకుంటాడు. ఆ తర్వాత నిజంగానే కావ్య కి తన మనసులో మాట చెప్పాలని ట్రై చేస్తాడు. తరువాయి భాగంలో రాజ్ కి కావ్య డిజైన్స్ చూపిస్తుంది. రాజ్ కి గతం గుర్తుకు వస్తుంటే అప్పుడే యామిని వచ్చి బావ అంటుంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
