Brahmamudi : ఆ నిజాన్ని బయటపెట్టనున్న కావ్య.. మాయ ఎవరో తెలియనుందా!
on May 20, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -414 లో.....కావ్య, రాజ్ ఇద్దరు ఇంటికి వచ్చాక.. ఎందుకు ఇలా చేసావ్ కొద్దిలో ఎంత ప్రమాదం తప్పిందని కావ్యని రాజ్ తిడతాడు. రాజ్ తిడుతుంటే కావ్య నవ్వుతుంటుంది. ఎందుకు నవ్వుతున్నావ్ ఇక్కడ తిడుతున్నానని రాజ్ అనగానే.. మీ తిట్లు కూడ తియ్యగా ఉన్నాయని కావ్య అంటుంది. నీకు బాబు వెనక ఉన్న కథ మొత్తం నీకు తెలుసని నాకు తెలిసింది. ఇప్పుడు నువ్వు ప్రాబ్లమ్ క్రియేట్ చెయ్యకని రాజ్ అంటాడు.
ఇప్పుడు ఆ మాయని తీసుకొని వస్తే అమ్మ తట్టుకోగలదా.. ఇక నీ ప్రయత్నం అపమని రాజ్ అంటాడు. నేను తీసుకొని రావడానికి కాదు.. అసలు నిజం బయటపెట్టడానికి వెళ్ళాను.. అసలు ఆ మాయ ఎందుకు బాబుని వదిలి దూరంగా ఉంటుంది. తనకి న్యాయం కావాలని కోరుకుంటుంది. ఇలా దూరంగా ఉండి డబ్బులు కోసం ఇలా చేస్తుంది.. ఏదో మాయ చేస్తుందని అనుమానంగా ఉంది. ఎలాగైనా నేను దానికి సంబంధించిన నిజం బయటపెడతాను.. మీరు నాకు అడ్డు రాకండి అని కావ్య చెప్పి వెళ్ళిపోతుంది. మరోవైపు రుద్రాణితో అనామిక మాట్లాడుతుంది. కళ్యాణ్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని ఇలా అనుకులేదు.. నేను నీ గురించి సలహా ఇస్తే ఇలా రివర్స్ అవుతుందనుకోలేదు..... టైమ్ కి అప్పు వచ్చింది.. చూసావా వాళ్ళు ప్లాన్ ప్రకారం ఇదంతా చేస్తున్నారు. కళ్యాణ్ ని ఒంటరివాన్ని చేస్తే అప్పుడు నీ గురించి ఆలోచిస్తాడని రుద్రాణి అంటుంది. అలా చెయ్యాలంటే ముందు కళ్యాణ్ లైఫ్ లో నుండి అప్పు వెళ్లి పోవాలని అనామిక అంటుంది. అది ముందు చెయ్ ఆ తర్వాత కళ్యాణ్ నీ మాట వినేలా.. నేను ప్లాన్ చేస్తానని రుద్రాణి అంటుంది దానికి అనామిక సరే అంటుంది.
ఆ తర్వాత కావ్య రాజ్ కి కాఫీ తీసుకొని వస్తుంది. కావ్యతో రాజ్ మాట్లాడడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఎప్పటిలాగే కోల్డ్ వార్ జరుగుతుంది. ఆ తర్వాత అందరు హాల్లో కూర్చొని ఉంటారు. పంతులు గారు దేవుడి దగ్గర అక్షింతలు తీసుకొని వచ్చి.. దంపతులు తీసుకొని భార్యాభర్తలని ఆశీర్వాదించండి అని చెప్తాడు. అందరు వరుసగా ఒక్కొక్కరుగా తమ భార్యలని ఆశీర్వదిస్తారు. కళ్యాణ్ మాత్రం పైనే ఉంటాడు. రాజ్ దగ్గర కావ్య ఆశీర్వాదం తీసుకోబోతుంటే.. రాజ్ ఏకపత్నివ్రతుడు కాదు కదా అని రుద్రాణి అంటుంది. తరువాయి భాగంలో బాబుకి సంబంధించి తన తల్లిని తీసుకొని వస్తానంటూ వెళ్ళింది.. ఇంకా రాలేదని అపర్ణ అంటుంది. తీసుకొని రాలేక మొహం చెల్లక అటే వెళ్ళిందేమోనని రుద్రాణి అంటుంది. అలా ఎందుకంటారు తీసుకొని వచ్చాను .. రా మాయ అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read