మూగ జీవాలపై జాలి చూపించండి అంటున్న రష్మీ
on Jun 23, 2022
జబర్దస్త్ తో మంచి పేరు తెచ్చుకుంది రష్మీ గౌతమ్. ఈమె అటు సినిమాలు, ఇటు టీవీ షోస్ , ఇంకో పక్క న్యూ షాప్ ఓపెనింగ్స్ కి వెళ్తూ మంచి ఫామ్ లో దూసుకుపోతోంది. ఇవన్నీ ఒక ఎత్తు ఈమె మనసు ఒక్కటే ఒక ఎత్తు. ఎందుకంటే ఈమెకి మూగజీవాలంటే చాలా ప్రేమ, ప్రాణం కూడా. ఈమె ఒకవిధంగా పెట్ లవర్. మాటలు రాని మూగ జీవాల్ని ఎవరు హింసించినా, బలి ఇచ్చినా ఈమె అసలు ఊరుకోదు. వాటి కోసం ఫైట్ చేస్తుంది. ఎప్పుడు , ఎక్కడ , ఎలాంటి సంఘటన జరిగినా మూగ జీవాలకు సంబంధించింది వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. లేటెస్ట్ గా ఆమె ఒక వీడియో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసుకుంది. అందులో ఒక కుక్క ఒక డబ్బాలో మూతి పెట్టేసి దాన్ని లాకోలేక పీక్కోలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఐతే అంతలో అక్కడికి యానిమల్ రెస్క్యూ టీమ్ వచ్చింది.
ఆ కుక్కని కాపాడటానికి హెల్ప్ చేస్తూ ఉంది ఆ టీమ్. ఇది ఒక అపార్ట్మెంట్ దగ్గర జరిగేసరికి ఆ అపార్ట్మెంట్ లో నుంచి ఒకాయన వచ్చి ఇక్కడ ఇలాంటివి చేయొద్దు వెళ్లిపోండి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు . ఈ సంఘటనపై రష్మీ చాలా బాధపడి అసహనం వ్యక్తం చేసింది. ఆ కుక్క మూతి డబ్బాలోంచి రాకపోతే ఏమి తినలేక ఆకలితో చచ్చిపోతుంది. కానీ ఈ అపార్ట్మెంట్ లోని ఒక అంకుల్ మాత్రం యానిమల్ రెస్క్యూ టీంని అక్కడ నుంచి వెళ్ళిపోమంటూ అరుస్తున్నాడు. మూగ జీవి ఇబ్బందిలో ఉంటె ఆ అంకుల్ అలా అనడం కరెక్టేనా అంటూ ప్రశ్నించింది ? ఏ మూగ జీవికి ఆపద వచ్చినా వెంటనే రెస్క్యూ టీంకి సమాచారం ఇవ్వండి. వాళ్ళు వచ్చాక వాళ్ళను పని చేయనివ్వండి. ఇలాంటి అంకుల్ ప్రవర్తించినట్టు ఎవరూ చేయొద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా అభ్యర్ధించింది రష్మీ గౌతమ్. ఇక నెటిజన్స్ కూడా రష్మీకి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేశారు.