ENGLISH | TELUGU  
Home  » TV News

మన కష్టాలు చెప్తే మీద చేతులేసేవాళ్ళే ఎక్కువ..!

on Aug 17, 2025

 

సౌమ్య బుల్లితెర యాంకర్ గా కొంతకాలం చేసింది. ఇప్పుడు ఢీ షోకి మెంటార్ గా ఆదితో కలిసి వస్తోంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన లైఫ్ లో జరిగిన ఎన్నో విషయాలు చెప్పింది. 

 

"మా నాన్న మా ఊరిలో అన్నీ అప్పులు చేసేసి వెళ్ళిపోయాడు. ఇచ్చిన వాళ్ళు, తీసుకున్నాయన బాగున్నారు. కానీ మేము బలైపోయాం. అప్పులు ఇచ్చిన వాళ్లంతా మా ఇంటికి వచ్చి రచ్చ రచ్చ చేసేవాళ్ళు. అమ్మకి భయం చాలా ఎక్కువ..ఎం చేయాలో తెలిసేది కాదు. అప్పట్లో మా ఇంటిని నడిపింది నేను. చదువుకుంటూనే జాబ్స్ చేసాను. వాటితోనే ఇల్లు గడిచేది. ఇంటికి చుట్టాలు వస్తే పాలు, కాఫీ పొడి కోసం అమ్మ పక్కింటి వాళ్ళ దగ్గరకు వెళ్తుందని వాళ్ళు తలుపులు వేసుకునేవారు. చుట్టాల పెళ్లిళ్లకు వెళ్తే మంచి చీర, నగలు లేవు అని మా అమ్మను వెనక్కి చివరన కూర్చోబెట్టేవాళ్ళు. నేను న్యూస్ రీడర్ గా పని చేసాను. అలాగే ఒక లాయర్ దగ్గర పని చేశా. అక్కడ నా కష్టాలు తెలిసి జాబ్ ఇంపార్టెంట్ అని తెలిసి ఆ లాయర్ నా భుజాల మీద చేతులు వేసేవాడు. టచ్ చేసేవాడు. ఎక్కడా కూడా మనకు కష్టాలు ఉన్నాయని చెప్పుకోకూడదు. నువ్వు లేకపోయినా నేను బతగ్గలను అనేలా ఉండాలి. ఈ టెన్షన్స్ మధ్య అమ్మకు బ్రెయిన్ కాన్సర్ వచ్చింది. 

మంచి ఫాదర్ మంచి ఫామిలీ ఉండడం కూడా ఒక తలరాత..మా నాన్న చేసిన పనికి అమ్మ మమ్మల్ని తిరుపతి తీసుకెళ్లింది. బస్ స్టాండ్ లో రెండు రోజులు తిండి లేకుండా ఉన్నా. ఎవరైనా కొంచెం అన్నం పెడతారేమో అని ఎంతలా ఎదురు చూశానో చెప్పలేను. ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు నాకు చిన్నపిల్లలను చూస్తే పెద్దగా ఫీలింగ్ రాదు. వాళ్లకు భవిష్యత్తు ఉంది. కానీ ముసలి వాళ్ళను చూస్తే బాధేస్తుంది. ఇది కలియుగం.. ఎవరినీ ఏమీ అనలేము. ఇలాంటి కాలంలో ఖర్మ, ధర్మంని అనుసరించి బతకాలి. మనం ఒకరికి చెడు చేస్తే మనకు తిరిగి వస్తుంది." అంటూ లైఫ్ గురించి ఖర్మ గురించి చెప్పుకొచ్చింది సౌమ్య.

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.