ఈ మిస్ ఇండియా ఇప్పుడు నాగార్జున హీరోయిన్!
on Oct 29, 2020
మాజీ మిస్ ఇండియా దియా మీర్జా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు గడిచాయి. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రేంజి దాకా వచ్చి, అంగుళం దూరంలో ఆగిపోయింది. అయినప్పటికీ మంచి మంచి పాత్రలతో అభిమానులను అలరిస్తూనే వస్తోంది. ఇప్పుడామె వయసు 38 సంవత్సరాలు. 20 ఏళ్లుగా తెలుగు చిత్రసీమకు రాని ఆమె, ఇప్పుడు తొలిసారి నాగ్ సరసన 'వైల్డ్ డాగ్'లో నటిస్తుండటం ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు త్వరలో రానున్నది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హిమాచల్ ప్రదేశ్లోని మనాలీ ప్రాంతంలో జరుగుతోన్న విషయం తెలిసిందే.
కాగా గురువారం దియా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన పిక్చర్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. అది ఆమె ప్రైమరీ స్కూల్ రోజుల నాటి ఫొటో. చుడీదార్ డ్రస్, భుజాన షోల్డర్ బ్యాగ్, కాళ్లకు సాధారణ స్లిప్పర్స్ వేసుకొని అతి మామూలు అమ్మాయిలా ఆ ఫొటో కనిపిస్తోంది దియా. ఆ ఫొటోతో పాటు తన ఫీలింగ్స్ను కూడా ఆమె పంచుకుంది. "నా బాల్యానికి సంబంధించి నేనేం చెబుతాను? ఆ సమయంలో మనకు తెలీదు కానీ, యూనివర్స్ టైమింగ్ ఎప్పుడూ కచ్చితంగానే ఉంటుంది. మీ బాల్యానికి సంబంధించి మీరేం చెబుతారు?" అని ప్రశ్నించింది దియా.
వ్యాపారవేత్త సాహిల్ సంఘాతో ఐదేళ్ల కాపురం తర్వాత 2019 ఆగస్ట్లో అతని నుంచి విడిపోయినట్లు ప్రకటించిది దియా.