'వాల్తేరు వీరయ్య' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. మరీ ఇంత ముందుగానా!
on Feb 7, 2023
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ 'వాల్తేరు వీరయ్య' ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం 25 రోజులు పూర్తి చేసుకొని వరల్డ్ వైడ్ గా రూ.230 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇదిలా ఉంటే ఈ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ త్వరలోనే ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ 'వాల్తేరు వీరయ్య' డిజిటల్ రైట్స్ ని భారీ ధరకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫిబ్రవరి 27 నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి రాబోతున్నట్లు తాజాగా నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. మాములుగా ఓటీటీ విడుదల తేదీని కేవలం కొద్ది రోజుల ముందుగా అనౌన్స్ చేస్తుంటారు. కానీ 'వాల్తేరు వీరయ్య' విషయంలో ఏకంగా 20 రోజుల ముందు ప్రకటన రావడం విశేషం.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకుడు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో అలరించాడు. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఈ చిత్రంలో చిరంజీవి కామెడీ టైమింగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.