అనుష్కను విరాట్ సాగనంపాడు..!
on Jun 3, 2016
బాలీవుడ్ హాటెస్ట్ కపుల్ విరాట్ అనుష్కలు మళ్లీ న్యూస్ లోకి వచ్చారు. అసలు వీళ్లిద్దరు కలిసున్నారా..విడిపోయారా..? వీళ్లిద్దరి మధ్య ఏం జరుగుతోంది..? ఇవే ఇప్పుడు బీటౌన్ జనాలకు పిచ్చెక్కిస్తున్న క్వశ్చన్స్. విషయం ఏంటంటే, ప్రస్తుతం తను నటిస్తున్న సుల్తాన్ సినిమా షూట్ కోసం బుడాపెస్ట్ వెళ్తోంది అనుష్క శర్మ. ఆమెను ఎయిర్ పోర్ట్ వరకూ వచ్చి సాగనంపాడు విరాట్. మామూలుగానే రద్దీగా ఉండే ముంబై ఎయిర్ పోర్ట్ లో ఈ స్టార్ కపుల్ ఎస్కేప్ అవడం కష్టం కదా..ఫోటోగ్రాఫర్లకు దొరికేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాకు మంచి మేతగా మారాయి. వీళ్లు కెమేరాలకు కలిసి చిక్కడం ఇది రెండోసారి. మొన్న వారమే వీళ్లిద్దరూ కలిసి ముంబైలో ఒక రెస్టారెంట్ లో ఖుషీగా ఎంజాయ్ చేశారు. కలిసి తిరగడం, అనుష్కను తన ట్విట్టర్లో విరాట్ వెనకేసుకురావడం లాంటి వాటిని చూసిన తర్వాత, వీరిద్దరూ మళ్లీ ప్యాచప్ అయిపోయారని ఈ ప్రేమకథకు పెళ్లి శుభం కార్డు పడటం ఖాయం అని గుసగుసలాడుకుంటున్నారు జనాలు. 2013 నుంచి డేటింగ్ లో ఉన్న వీళ్లిద్దర్నీ బాలీవుడ్ బెస్ట్ కపుల్ గా అనుకున్నారు చాలా మంది. అయితే ఏం గొడవ జరిగిందో ఏమో కానీ, సడెన్ గా కోహ్లీ అనుష్కను అన్ ఫాలో అవడమే కాక, గుండె పగిలింది అన్న క్యాప్షన్ తో ఇన్ స్టాగ్రామ్ ఫోటో పెట్టాడు. ఇక వీళ్లిద్దరికీ మధ్య బ్రేకప్ కన్ఫామ్ అని అందరూ ఫిక్సైన టైం లో, ఇదిగో మళ్లీ ఇలా కలిసి దర్శనాలు ఇస్తున్నారు. మరి వీళ్ల లవ్ స్టోరీ క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో చూడాలి.