'సరిలేరు నీకెవ్వరు' దీపావళి డబుల్ ధమాకా!
on Oct 26, 2019
సూపర్స్టార్ మహేశ్ అప్ కమింగ్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి సంబంధించి న్యూ స్టిల్స్ను దీపావళి శుభాకాంక్షలతో విడుదల చేశారు. మహేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దిల్ రాజు సమర్పిస్తున్నారు. 13 సంవత్సరాల విరామంతో లేడీ అమితాబ్ విజయశాంతి ఈ చిత్రంలో నటిస్తుండటం విశేషం. ఆమె 'సరిలేరు నీకెవ్వరు'లో భారతి అనే కీలక పాత్రలో నటిస్తున్నారు.
శనివారం దీపావళి శుభాకాంక్షలతో ఆమె లుక్ పోస్టర్ని నిర్మాతలు విడుదల చేశారు. సూపర్ స్టార్ అభిమానులకి దీపావళి డబుల్ ధమాకా లాగా శనివారం సాయంత్రం 5:04 గంటలకి మహేశ్ బుల్లెట్ మీద వస్తున్న డాషింగ్ పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. నవంబర్ 4 నుంచి నెలాఖరు వరకు తమిళనాడు, కేరళలో జరిగే ఔట్డోర్ షెడ్యూల్తో ఆల్మోస్ట్ షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. సంక్రాంతి కానుకగా వరల్డ్వైడ్గా జనవరి 12న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మహేశ్ జోడీగా రష్మికా మందన్ననాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్, ప్రకాష్రాజ్, సంగీత, బండ్ల గణేశ్ కీలక పాత్రధారులు. దేవి శ్రీప్రసాద్, రత్నవేలు, కిశోర్ గరికిపాటి, తమ్మిరాజు, రామ్-లక్ష్మణ్, యుగంధర్ టి., ఎస్.కృష్ణ సాంకేతిక వర్గం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
