హిందీ హీరోతో వంశీ పైడిపల్లి సినిమా.. ఆ అగ్ర హీరోనేనా!
on Oct 14, 2025

మాన్ ఆఫ్ మాసెస్ 'ఎన్టీఆర్'(Ntr)అంటేనే మాస్ కి బ్రాండ్ అంబాసిడర్. అలాంటి ఎన్టీఆర్ క్లాస్ యాక్షన్ ని కూడా ఒక రేంజ్ లో పెర్ఫార్మ్ చేయగలడని నిరూపించిన చిత్రం 'బృందావనం'(Brindavanam).లవర్ బాయ్ గాను మెప్పించాడు. అలాంటి ఈ చిత్రంతో దర్శకుడుగా సినీ రంగంలో తనకంటు ప్రత్యేక గుర్తింపు పొందాడు వంశీ పైడిపల్లి'(Vamsi paidipally).కథకి సంబంధించిన అన్ని వేరియేషన్స్ తో పాటు, అందుకు తగ్గట్టుగా నటీనటుల్ని వంశీ డీల్ చేసే విధానం ప్రతి ఒక్కర్ని కట్టిపడేస్తుంది. ప్రభాస్ తో మున్నా, రామ్ చరణ్, అల్లు అర్జున్ ల ఎవడు, నాగార్జున కార్తీల ఊపిరి, మహేష్ తో మహర్షి వంటి చిత్రాలని తెరకెక్కించి అగ్ర దర్శకుడిగా ఎదిగాడు. కథకి తగ్గ టేకింగ్ తో ప్రేక్షకులని మెస్మరైజ్ చెయ్యడంలో కూడా వంశీ కి తిరుగులేదు.
ఇక వంశీ తమిళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చి ఇళయదళపతి 'విజయ్' తో 'వారిసు'(varisu)తెరకెక్కించి తెలుగు దర్శకుల గౌరవాన్ని రెట్టింపు చేసాడు. 2023 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి విజయాన్నే అందుకుంది. ఈ చిత్రం తర్వాత వంశీ నుంచి ఎలాంటి కొత్త చిత్రానికి సంబంధించిన ప్రకటన రాలేదు. రీసెంట్ గా వినిపిస్తున్న కథనాల ప్రకారం వంశీ ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెడుతు, అగ్ర హీరో సల్మాన్ ఖాన్(Salman Khan)తో ఒక సినిమా చెయ్యబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు వంశీ పూర్తి స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడని సల్మాన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ చిత్రం గురించి అధికార ప్రకటన రానుందని కూడా అంటున్నారు.
దీంతో ఇప్పుడు ఈ న్యూస్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. సల్మాన్ ప్రస్తుతం 'బాటిల్ ఆఫ్ గల్వాన్' అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం సెట్స్ పై ఉండగానే,వంశీ పైడిపల్లి చిత్రం కూడా స్టార్ట్ చేస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సల్మాన్ మాత్రం గత కొంత కాలం నుంచి వరుస పరాజయాలతో సతమవుతున్నాడు. రీసెంట్ గా సికందర్ తో భారీ ప్లాప్ ని అందుకున్నాడు. ఈ క్రమంలో సల్మాన్, వంశీ ప్రాజెక్ట్ అధికారకంగా ఖాయమైతే కనుక సల్మాన్ ని వంశీ హిట్ ని అందిస్తాడేమో చూడాలి. ఈ చిత్రాన్ని దిల్ రాజు(Dil Raju) నిర్మించబోతున్నాడని టాక్.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



