అడవి బాటలో అప్ కమింగ్ తెలుగు క్రేజీ ప్రాజెక్ట్స్!
on Dec 10, 2021

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కో సమయంలో ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. ప్రస్తుతం యాదృచ్ఛికంగా అలాంటి ట్రెండ్ ఒకటి కనిపిస్తోంది. అదేమిటంటే.. విడుదలకు సిద్ధమైన పలు క్రేజీ ప్రాజెక్ట్స్ అడవి బాట పట్టడం.
ఆ వివరాల్లోకి వెళితే.. వచ్చే వారం థియేటర్స్ లోకి రానున్న అల్లు అర్జున్ సినిమా `పుష్ప - ద రైజ్` ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే చిత్రంగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కగా.. జనవరి 7న విడుదల కానున్న మరో పాన్ - ఇండియా మూవీ `ఆర్ ఆర్ ఆర్` కూడా అడవి నేపథ్యంతోనే రాబోతోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇందులో హీరోలుగా నటించారు. ఇక పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటించిన `భీమ్లా నాయక్` కూడా అటవీ ప్రాంతంలో సాగే కథే. అంతేకాదు.. చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో రాబోతున్న `ఆచార్య` కూడా నక్సలిజం టచ్ తో కొంతమేర ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగబోతోందని ప్రచార చిత్రాలని బట్టి స్పష్టమవుతోంది. ఇక విడుదలకు సిద్ధమైన పిరియడ్ డ్రామా `విరాట పర్వం` కూడా ఈ తరహా సినిమానే.
మరి.. తక్కువ గ్యాప్ లోనే రాబోతున్న ఈ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ మూవీస్.. ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



