డిసెంబర్ లో పాన్ - ఇండియా మూవీస్ జాతర!
on Nov 29, 2021
`బాహుబలి` సిరీస్ తో పాన్ - ఇండియా మూవీస్ ట్రెండ్ ఊపందుకుంది. ప్రస్తుతం పలు ప్రాజెక్ట్స్ ఈ బాటలో వెళుతూ.. దేశవ్యాప్తంగా పలు భాషల్లో వినోదాలు పంచనున్నాయి.
ఇదిలా ఉంటే.. డిసెంబర్ నెలలో వరుసగా నాలుగు వారాల పాటు ఈ తరహా చిత్రాలు వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 2న మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఎపిక్ వార్ డ్రామా `మరక్కార్` రిలీజ్ కానుంది. తెలుగులో మాత్రం డిసెంబర్ 3న ఎంటర్టైన్ చేయనుందీ చిత్రం. ఇక డిసెంబర్ 10న రెండు పాన్ - ఇండియా మూవీస్ విడుదల కానున్నాయి. శ్రియ, నిత్యా మీనన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్ నటించిన `గమనం`తో పాటు మడ్ రేసింగ్ నేపథ్యంలో రూపొందిన `మడ్డీ` కూడా ఆ రోజున పలు భాషల్లో విడుదల కానున్నాయి.
అలాగే డిసెంబర్ 17న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో నటించిన `పుష్ప - ద రైజ్` పాన్ - ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. అదే విధంగా క్రికెట్ నేపథ్యంలో రూపొందిన `83` (రణ్ వీర్ సింగ్, దీపికా పదుకోణ్) కూడా హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో డిసెంబర్ 24న తెరపైకి రాబోతోంది. ఇక అదే రోజున నేచురల్ స్టార్ నాని నటించిన పిరియడ్ డ్రామా `శ్యామ్ సింగ రాయ్`.. దక్షిణాది నాలుగు భాషల్లో పాన్ - సౌత్ ఇండియా మూవీగా ఎంటర్టైన్ చేయనుంది.
మరి.. విభిన్న కథాంశాలతో రూపొందిన ఈ చిత్రాల్లో ఏయే సినిమాలు జనాదరణ పొందుతాయో చూడాలి.
Also Read