మరో నటుడు ఆత్మహత్య
on Aug 6, 2020
ఈ ఏడాది దేశంలోని ఫిల్మ్, టెలివిజన్ ఇండస్ట్రీలలో పలు ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. వాటిలో మన్మీత్ గ్రేవాల్, ప్రేక్షా మెహతా, సుశాంత్సింగ్ రాజ్పుత్ వంటి వారివి ఉన్నాయి. తాజాగా మరో టీవీ యాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన.. 'యే రిష్తే ప్యార్ కే' సీరియల్ ద్వారా అందరినీ అలరిస్తోన్న సమీర్శర్మ. ఆయన వయసు 44 సంవత్సరాలు. ముంబైలోని మలాడ్ వెస్ట్లో ఉన్న తన నివాసంలో వంటగది సీలింగ్కు ఉరివేసుకొని ఉండగా ఆయనను కనుగొన్నారు.
కహానీ ఘర్ ఘర్ కీ, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూ, ఏక్ బార్ ఫిర్ వంటి సీరియల్స్ ద్వారా సమీర్ పాపులర్ అయ్యారు. అటాప్సీ కోసం ఆయన భౌతిక దేహాన్ని ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రదేశంలో సూసైట్ నోట్ లాంటిదేమీ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సమీర్శర్మ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు కారణమా, లేక మరింకేదైనా కారణముందా అనే కోణంలో వారు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.