అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో మరో మూవీ.. ప్రొడ్యూసర్ నాగ వంశీ ట్వీట్!
on Oct 28, 2021
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. హ్యాట్రిక్ విజయాలను అందుకున్న ఈ క్రేజీ కాంబినేషన్ లో మరో మూవీ రానుందని తెలుస్తోంది.
బన్నీ-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన 'జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురములో' విజయాలను అందుకున్నాయి. ఈ మూడు సినిమాలను హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మించడం విశేషం. ముఖ్యంగా వీటిలో 'అల వైకుంఠపురములో' సినిమా సంచలన విజయాన్ని అందుకొని ఎన్నో రికార్డ్స్ ను సృష్టించింది. ఇక తమన్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ సాంగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. దీంతో ఈ కాంబో అంటే ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయితే త్వరలోనే ఈ కాంబోలో మరో మూవీ రానుందని నిర్మాత నాగ వంశీ హింట్ ఇచ్చారు.
సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మించిన సినిమా 'వరుడు కావలెను'. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న(బుధవారం) జరిగింది. ఈ సందర్భంగా బన్నీ, త్రివిక్రమ్, తమన్ తో కలిసి దిగిన ఫోటోను నాగ వంశీ ట్విట్టర్ లో షేర్ చేశారు. అంతేకాదు కాదు, "త్వరలోనే హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ నుంచి ఓ సర్ ప్రైజ్ రానుందని" ట్వీట్ చేశారు. దీంతో ఈ కాంబోలో మరో సినిమా రానుంది అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Also Read