శింబు మోసం చేశాడు.. నాకు రూ. 15 కోట్లు లాస్.. పోలీసులకు ప్రొడ్యూసర్ కంప్లయింట్!
on Oct 28, 2021
తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ యాక్టర్లలో శింబు ఒకడు. అంతేకాదు, మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సన్స్లో ఒకడు కూడా. శింబు కారణంగా ఇదివరకు తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫెఫ్సీ మధ్య గొడవ ఏర్పడింది. ఇప్పుడు అతనిపై కొత్తగా మరో ఫిర్యాదు వచ్చింది. శింబు మునుపటి సినిమా 'అన్బనవన్ అసరధవన్ అడంగధవన్' (ఏఏఏ) ప్రొడ్యూసర్ మైఖేల్ రాయప్పన్ చెన్నై పోలీస్ కమిషనర్కు శింబుపై కంప్లయింట్ చేశాడు. ఆ సినిమా రిలీజ్ అయినప్పట్నుంచీ శింబు, రాయప్పన్ మధ్య గొడవ జరుగుతోంది.
రాయప్పన్ ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, 'అన్బనవన్ అసరధవన్ అడంగధవన్'ను ఒక సినిమాగానే తియ్యాలని అనుకున్నారు. కానీ శింబు దాన్ని రెండు భాగాలుగా తియ్యాలని అడిగాడు. దానికి తగ్గట్లు 50 శాతం పోర్షన్నే పూర్తి చేశాడు. బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా భారీగా నష్టాలు తెచ్చింది. ఆ నష్టాల్ని భర్తీ చేయడానికి తనకు మరో సినిమా చేసిపెడతానని శింబు మాటిచ్చాడని రాయప్పన్ తెలిపారు.
'ఏఏఏ' వల్ల తనకు దాదాపు రూ. 15 కోట్ల మేర నష్టాలు వచ్చాయనీ, తన సమస్యను పరిష్కరిస్తామని మునుపటి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు విశాల్ ప్రామిస్ చేశాడనీ తన ఫిర్యాదులో రాయప్పన్ వెల్లడించారు. ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా తనకు ఒక సినిమా చేసిపెడతానని శింబు కూడా మాటిచ్చాడని తెలిపారు. కానీ తర్వాత ఇచ్చిన మాట నిలుపుకోకుండా శింబు తనను మోసం చేశాడని రాయప్పన్ తన ఫిర్యాదులో ఆరోపించారు.
Also Read