తెలుగులో త్రిష వెబ్ సిరీస్ 'బృంద'!
on Oct 16, 2021
త్రిష తొలిసారిగా ఓ వెబ్ సిరీస్ చేస్తోంది. ఆ సిరీస్ పేరు 'బృంద'. సోనీ లివ్లో రిలీజ్ అయ్యే ఆ షోకు సూర్య వంగల దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో రూపొందే ఈ సిరీస్ను ఇతర లాంగ్వేజెస్లో డబ్ చేస్తారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షేర్ చేసింది త్రిష. ఈ సిరీస్ కోసం ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసినట్లు ఆమె రివీల్ చేసింది. దసరా సందర్భంగా అక్టోబర్ 16న పూజా కార్యక్రమంతో ఈ షోను లాంచ్ చేశారు.
త్రిష షేర్ చేసిన వీడియోలో దర్శక నిర్మాతలు ఆమెకు బొకే అందజేసి, సాదర స్వాగతం చెబుతున్నారు. "Welcome on board our Brinda Miss: Trisha Krishnan and Stories and team (sic)." అనే మెసేజ్తో వారు ఆమెకు స్వాగతం పలికారు.
త్రిష చివరిసారిగా 'పరమపదం విలయాట్టు' మూవీలో కనిపించింది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో నేరుగా రిలీజ్ అయిన ఆ మూవీకి నెగటివ్ రివ్యూస్ వచ్చాయి. వీక్షకుల నుంచి కూడా సరైన ఆదరణ లభించలేదు.
Also Read