అనుష్క వేడుకకు వచ్చే హీరోలెవరు?
on Mar 11, 2020
ఫిల్మ్ యాక్టర్గా అనుష్క ప్రయాణానికి 15 సంవత్సరాలు నిండాయి. నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన 'సూపర్' (2005) ఆమె తొలి చిత్రం. ఆ మూవీలో ఆమె సెకండ్ హీరోయిన్గా నటించింది. ఆ మూవీ 2005 జూలైలో విడుదలైనప్పటికీ, ఆమె ఆ సినిమా సెట్స్పై మార్చిలోనే అడుగుపెట్టింది. అందుకే గురువారం సాయంత్రం హైదరాబాద్లోనే ట్రైడెంట్ హోటల్లో అనుష్క 15 ఏళ్ల కెరీర్ వేడుకను ఆమె లేటెస్ట్ ఫిల్మ్ 'నిశ్శబ్దం' నిర్మాతలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు టాలీవుడ్లోని టాప్ స్టార్స్, టాప్ డైరెక్టర్స్తో పాటు అనుష్కతో కలిసి పనిచేసిన హీరోలు, దర్శకులు, నిర్మాతలను ఆహ్వానిస్తున్నారు.
వీరిలో ఎవరెవరు ఈ వేడుకకు హాజరవుతారనే విషయం ఆసక్తికరంగా మారింది. అనుష్కకు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు అయిన ప్రభాస్ ప్రస్తుతం అందుబాటులో లేడు. అతను తన 'ఓ డియర్' సినిమా షూటింగ్ నిమిత్తం యూరప్లో ఉన్నాడు. ఇక తొలి చిత్రం హీరో, కెరీర్ మొదట్లో ఆమెకు బాగా సపోర్ట్ చేసిన సీనియర్ స్టార్ నాగార్జున ఈ వేడుకలో పాల్గొననున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవిని కూడా ఈ వేడుకకు ఆహ్వానించారు. తప్పకుండా వస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఆ ఇద్దరూ జంటగా నటించకపోయినా 'స్టాలిన్' మూవీలో ఓ స్పెషల్ సాంగ్ చేశారు. బాలకృష్ణ, మహేశ్ వస్తారా, రారా? అనే విషయం సందిగ్ధం. బాలకృష్ణతో 'ఒక్క మగాడు', మహేశ్తో 'ఖలేజా' సినిమాల్లో అనుష్క హీరోయిన్గా నటించింది. ఆ ఇద్దరిని కూడా ఈ వేడుకకు పిలిచారు.
వెంకటేశ్, జగపతిబాబు, అల్లు అర్జున్, రవితేజ, గోపీచంద్, రానా, మంచు విష్ణు ఈ వేడుకలో పాల్గొంటారని భావిస్తున్నారు. వీళ్లు కాకుండా ఇంకెవరు వస్తారో చూడాలి. ఈ వేడుకకు కేవలం టాలీవుడ్ స్టార్స్ను మాత్రమే పిలుస్తున్నారు.