హ్యాట్రిక్ పై కన్నేసిన సూర్య!
on Jan 29, 2022
వైవిధ్యానికి అగ్ర తాంబూలమిచ్చే కథానాయకుల్లో కోలీవుడ్ స్టార్ సూర్య ఒకరు. ఆ మధ్య కాస్త ట్రాక్ తప్పిన సూర్య.. ప్రస్తుతం టాప్ ఫామ్ లో ఉన్నారు. ఏడాది వ్యవధిలో తను నటించిన రెండు సినిమాలు ఓటీటీలో విడుదలై సంచలనం సృష్టించడమే ఇందుకు నిదర్శనం. ఆ చిత్రాలే.. `సూరరై పోట్రు` (తెలుగులో `ఆకాశం నీ హద్దురా!`), `జై భీమ్`. ఈ రెండు కూడా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయి నటుడిగా సూర్యకి ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చాయి. పురస్కారాల బాట కూడా పట్టాయి. అంతేకాదు.. ఈ చిత్రద్వయాలు థియేటర్స్ లో రిలీజై ఉంటే నెక్స్ట్ లెవల్ లో ఉండేదన్న అభిప్రాయాలు వినిపించాయి.
Also Read: డైరెక్ట్ రిలీజ్ కోసం 'రాధేశ్యామ్'కు ఓటీటీ దిగ్గజం రూ. 400 కోట్ల ఆఫర్?
ఇదిలా ఉంటే.. అతి త్వరలో సూర్య తన తదుపరి చిత్రంతో థియేటర్స్ లోనే సందడి చేయబోతున్నారు. ఆ సినిమానే.. `ఎదర్కుమ్ తుణిందవన్`. పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. కేవలం తమిళంకే పరిమితం కాకుండా ఇతర భాషల్లోనూ `ఈటి` పేరుతో అనువాదం కానుంది. `గ్యాంగ్ లీడర్` ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ నాయికగా నటించిన ఈ చిత్రం.. అన్నీ అనుకూలంగా ఉంటే ఫిబ్రవరి 4న థియేటర్స్ లోకి వస్తోంది. లేదంటే మరికొంతకాలం వాయిదా పడే అవకాశముంది. మరి.. `ఈటి`తో హ్యాట్రిక్ పై కన్నేసిన సూర్య.. టార్గెట్ రీచ్ అవుతారో లేదో చూడాలి.