గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్.. అఫిషియల్ ఎంట్రీగా 'జై భీమ్'!
on Dec 2, 2021
సూర్య ప్రధాన పాత్ర పోషించిన 'జై భీమ్' మూవీ నేరుగా ఓటీటీలో రిలీజై బ్లాక్బస్టర్ హిట్ కొట్టింది. రిలీజైన దగ్గర్నుంచీ ఆ మూవీ వార్తల్లో నిలిచింది. ఒకవైపు నలుమూలల నుంచీ ప్రశంసలు దక్కించుకున్న ఆ సినిమాను కాంట్రవర్సీలూ చుట్టుముట్టాయి. ఇప్పుడు మరోసారి ఆ సినిమా హెడ్లైన్స్లోకి ఎక్కింది. అయితే అది సంతోషకరమైన వార్తే. ప్రతిష్ఠాత్మక 'గోల్డెన్ గ్లోబ్స్ 2022' అవార్డులకు అధికారిక ఎంట్రీని ఆ మూవీ సంపాదించింది. యస్. 'బెస్ట్ నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిల్మ్' విభాగంలో 'జై భీమ్'కు ఈ ఎంట్రీ దక్కింది. ఇప్పటికే ఆ సినిమా ఐఎండీబీ రేటింగ్స్లో 'ద షాషంక్ రిడెంప్షన్', 'ద గాడ్ఫాదర్' లాంటి హాలీవుడ్ క్లాసిక్స్ను వెనక్కి నెట్టి, 9.6 రేటింగ్తో టాప్ పొజిషన్లో నిలవడం ద్వారా సంచలనం సృష్టించింది.
వీక్షకుల ఆదరణ, విమర్శకుల ప్రశంసలు పొందిన 'జై భీమ్' వివాదానికీ కేంద్రబిందువుగానూ మారింది. తమ కులాన్ని తప్పుగా చూపించారని ఆరోపిస్తూ 'వన్నియార్ సంగమ్' లీగల్ నోటీసును జారీ చేసింది. అంతే కాదు, సూర్యను చంపుతామంటూ బెదిరింపులు కూడా వచ్చాయి. దాంతో చెన్నైలోని ఆయన ఇంటికి పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.
రాజాకన్ను అనే అమాయకుడ్ని దొంగతనం నేరంమోపి, లాకప్లో చిత్రహింసలకు గురిచేయడం ద్వారా చంపేసిన పోలీసులపై లాయర్ చంద్రు సాయంతో అతని భార్య పార్వతి జరిపిన న్యాయపోరాటం 'జై భీమ్'లోని ప్రధాన ఇతివృత్తం.
Also Read