'మహాసముద్రం' హీరో వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాడు!
on Oct 29, 2020
తమిళ నటుడు సిద్ధార్థ్ తెలుగు సినిమాలతో మన ప్రేక్షకులకూ సన్నిహితుడయ్యాడు. ముఖ్యంగా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' సినిమాలు అతడికి ఎంతటి పేరు తెచ్చాయో మనకు తెలుసు. జబర్దస్త్ సినిమా తర్వాత అతను మళ్లీ ఏ డైరెక్ట్ తెలుగు సినిమాలోనూ కనిపించలేదు. ఇప్పుడు అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తోన్న 'మహాసముద్రం' చిత్రంతో ఏడేళ్లకు పైగా విరామంతో టాలీవుడ్కు వస్తున్నాడు. ఇందులో శర్వానంద్తో అతను స్క్రీన్ను పంచుకుంటున్నాడు.
ఆ సినిమా షూటింగ్లోకి అడుగు పెట్టడానికి ముందు ఓ వెబ్ సిరీస్ షూటింగ్ను ప్రారంభించాడు సిద్ధార్థ్. ఆ సిరీస్ పేరు 'ఎస్కేప్ లివ్'. హిందీలో రూపొందుతోన్న ఈ సిరీస్ను ఒన్ లైఫ్ స్టూడియోస్ బేనర్పై సిద్ధార్థ్ కుమార్ తివారీ నిర్మిస్తున్నాడు. ముంబైలో అతనికి చెందిన స్టూడియోలోనూ దీని చిత్రీకరణ మొదలైంది. అభిషేక్ సేన్గుప్తాతో కలిసి సిద్ధార్థ్ కుమార్ దీనిని డైరెక్ట్ చేస్తున్నాడు. ఒక పాపులర్ లైవ్ స్ట్రీమింగ్ యాప్ను ఉపయోగించుకొని ఓవర్నైట్ స్టార్లు కావాలని కలలుకొనే ఐదుగురు వ్యక్తుల చుట్టూ ఈ సిరీస్ కథ నడుస్తుంది. 'మిర్జాపూర్' ఫేమ్ శ్వేతా త్రిపాఠి కూడా ఇందులో కీలక పాత్ర చేస్తోంది.
Also Read