‘సరిలేరు నీకెవ్వరు’కు గుమ్మడికాయ కొట్టేశారు!
on Dec 19, 2019
మహేష్ హీరోగా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్పై దిల్ రాజు సమర్పిస్తోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో రష్మికా మందన్న నాయిక. జి.ఎం.బి. ఎంటర్టైన్మెంట్, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ షూటింగ్ పూర్తయింది. ప్రత్యేక పాత్రలో లేడీ అమితాబ్ విజయశాంతి నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ 18న పూర్తయింది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ "జులై 5న మొదలైన ఈ 'సరిలేరు నీకెవ్వరు' మెమొరబుల్ జర్నీ డిసెంబర్18తో పూర్తయింది. సినీ ప్రేమికులకు, మహేష్ బాబు ఫ్యాన్స్కి ఈ సంక్రాంతి ఒక మెమరబుల్గా ఉండబోతుంది" అన్నారు.
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ "చిత్రసీమలో ప్రవేశించిన తర్వాత మరపురాని జ్ఞాపకాన్ని ఇచ్చిన నా ప్రియమైన సూపర్ స్టార్ మహేష్ బాబుకి ధన్యవాదాలు. అలాగే ఈ అద్భుతమైన షూటింగ్ని సంతోషకరంగా ముగించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి, రత్నవేలు, దేవి శ్రీప్రసాద్, కిశోర్ గరికిపాటి సహా ఎంటైర్ 'సరిలేరు నీకెవ్వరు’ యూనిట్కి థాంక్స్" అని చెప్పారు.
ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. వచ్చే సోమవారం (డిసెంబర్ 23) విడుదల కానున్ననాలుగో పాట క్లాస్్గా ఉంటుందని ఇంట్రెస్టింగ్ అప్డెట్ ఇచ్చారు దేవి శ్రీ ప్రసాద్. ఈ పాట కోసం ఆయన యూరోప్లోని అతి పెద్ద ఆర్కెస్ట్రాతో కలిసి మ్యూజిక్ కంపోజ్ చేశారు. అక్కడి ఫారిన్ మ్యూజిషియన్స్తో కలిసి ఈ పాటని ప్రత్యేకంగా రికార్డ్ చేశారు దేవి. జనవరి 5 ఆదివారం సాయంత్రం 5:04 నిమిషాలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో 'సరిలేరు నీకెవ్వరు’ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ను జరిపి సంక్రాంతి కానుకగా జనవరి 11న చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు నిర్మాతలు.
రాజేంద్రప్రసాద్, ప్రకాష్రాజ్, సంగీత, బండ్ల గణేష్, హరితేజ తారాగణమైన నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్, రత్నవేలు, కిశోర్ గరికిపాటి, అజయ్ సుంకర, తమ్మిరాజు, రామ్-లక్ష్మణ్, యుగంధర్, టి.ఎస్. కృష్ణ సాంకేతిక వర్గం.
Also Read