ఐటీ దాడుల నేపథ్యంలో తాప్సీకి అండగా సమంత!
on Mar 7, 2021
సమంతా అక్కినేని, తాప్సీ పన్ను లాంటి తారలు తమ కెరీర్లో చాలా దూరం ప్రయాణించారు. ఎన్నో హెచ్చు తగ్గులు ఎదుర్కొని ఇండస్ట్రీలో తమకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు. "తారలు స్నేహితులు కాలేరు" అనే నానుడిని బ్రేక్ చేసిన యాక్ట్రెసెస్లో ఈ ఇద్దరు కూడా ఉన్నారు. ఒకరి ఫోటోలను ఒకరు లైక్ చేయడం, కామెంట్ చేయడంతో పాటు, ఒకరినొకరు ప్రశంసించుకుంటూ పోస్టులు పెడుతుంటారు. ఇటీవల తాప్సీ ఇంటిపై ఇన్కమ్ టాక్స్ అధికారులు దాడిచేయగా, ఆమెకు మనోధైర్యం కలిగించడానికి సమంత అప్రిసియేషన్ పోస్ట్ను షేర్ చేసింది. ప్రతిస్పందనగా సమంతకు థాంక్స్ చెప్పింది తాప్సీ.
తాప్సీ ఫొటోనొకదాన్ని షేర్ చేసిన సమంత, "this is just a @taapsee appreciation post..that's all," అని రాసి, ఒక హార్ట్ ఎమోటికాన్ను జోడించింది. వెంటనే రెస్పాండ్ అయిన తాప్పీ, "Uff..thank you Sam...big hug to you," అని రాసి, ఏడుస్తున్న ఓ హార్ట్ ఎమోటికాన్ను పెట్టింది.
ఐటీ డిపార్ట్మెంట్ దాడి తర్వాత, తాప్పీ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్పందిస్తూ, "3 రోజుల పాటు 3 విషయాల కోసం తీవ్రంగా శోధించారు.. 1. నాకు పారిస్లో ఉన్నదంటున్న బంగళా తాలూకు తాళాలు. ఎందుకంటే వేసవి సెలవులు దగ్గర్లో ఉన్నాయి కదా. 2. ఇంతకు ముందు నేను తిరస్కరించిన రూ. 5 కోట్ల విలువ కల ఆరోపిత రిసీప్ట్ గురించి, 3. మన గౌరవనీయ ఆర్థిక మంత్రి ప్రకారం 2013లో జరిగిన దాడి నాటి నా జ్ఞాపకం.. పిఎస్- ఇకపై అంత శాస్తి కాదు.” అని రాసుకొచ్చింది.
డైరెక్టర్ అనురాగ్ కశ్యప్కు చెందిన ముంబై, పూణేలలోని ఇళ్లు, ఆఫీసులపైన కూడా ఐటీ దాడులు జరిగాయి. తాప్పీ, కశ్యప్ ఇదివరకు 'మన్మర్జియాన్' సినిమాకి కలిసి పనిచేశారు. ప్రస్తుతం 'దోబారా' అనే సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తున్నారు.