పాపం... బాన్సువాడ భానుమతి
on Aug 2, 2017
దీపం ఉండగానే.. ఇల్లు చక్కపెట్టుకోవాలనేది పెద్దల మాట అయితే... ఇమేజ్, అందం ఉండగానే కోట్లు సంపాదించేయాలనేది మన కథానాయికల స్టేటజీ. ఒక్క సినిమా హిట్ అయితే చాలు.... అమాంతం రెమ్యునరేషన్లు పెంచేస్తుంటారు ఈ అందాల భామలు.
కేవలం తాము నటించిన సినిమా హిట్ అయితేనే పారితోషికాలు పెంచేసే హీరోయిన్లు ఉన్న నేటి తరుణంలో... ‘అసలు సినిమా విజయానికి కారణమే నువ్వమ్మా...’ అని అందరిచే జేజేలు పలికించుకుంటున్న కథానాయిక అయితే... ఇక ఆ ఆమె గారి వ్యవహారం ఎలా ఉంటుంది ఊహించండి. ఇప్పుడు సాయి పల్లవి పరిస్థితి కూడా అదే కదా! మరి తను పారితోషికం ఎంత పెంచి ఉండాలి? చాలామంది డిస్కస్ చేసుకుంటున్న విషయం ఇది.
నిజానికి ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లు సమంత, తమన్నా, కాజల్ కోటిన్నర దాకా తీసుకుంటున్నట్లు టాక్. ఎందుకంటే... కెరీర్ లో దాదాపుగా ఓ యాభై సినిమాల వరకూ చేసిన హీరోయిన్లు వారు. పైగా ఎంతో మంది హీరోలతో సూపర్ హిట్లు ఇచ్చిన క్రెడిట్ వారిది.
కానీ... సాయిపల్లవి పరిస్థితి అందుకు భిన్నం. ‘ఫిదా’కు ముందు వరకూ... సాయిపల్లవి పారితోషికం కేవలం 30 లక్షలే. చేసిన సినిమాలు కూడా తక్కువ. అయితే... ‘ఫిదా’తర్వాత మాత్రం ఆమె ఎంత అడిగితే.. అంత ఇచ్చే నిర్మాతలు ఉన్నారు. కానీ... సాయి పల్లవి అలా చేయలేదు. ప్రస్తుతం ఆమె 70 లక్షల వరకూ అడుగుతోందని తెలిసింది. ఇదే హిట్ మరో హీరోయిన్ కి వచ్చి ఉంటే... కోటికి పైనే అంకె చెప్పేది. కాదంటారా? మరి సాయి పల్లవి ఇంకా లక్షల్లోనే ఉండిపోయిందంటే.. బహుశా మిగిలిన హీరోయిన్లకు ఉన్నంత తెలివితేటలు ఈ ముద్దుగుమ్మకు లేవేమో..
పాపం... బాన్సువాడ భానుమతి... కాస్త అప్ డేట్ అవ్వమ్మా... పుక్కట్లా తీసుకోట్టేదు కదా..!
Also Read