`రాధే శ్యామ్` కోసం రూ. 50 కోట్ల క్లైమాక్స్!
on Oct 20, 2021
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చాన్నాళ్ళ తరువాత చేసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ `రాధే శ్యామ్`. `జిల్` రాధాకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ కి జంటగా `బుట్టబొమ్మ` పూజా హెగ్డే నటించింది. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ పాన్ - ఇండియా మూవీ.. సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. `రాధే శ్యామ్`కి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. 15 నిమిషాల పాటు సాగే ఈ సినిమా పతాక సన్నివేశాల కోసం దాదాపు రూ.50 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించారట. అంతేకాదు.. విజువల్ ఫీస్ట్ లా ఈ క్లైమాక్స్ ఉంటుందని బజ్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. కాగా, ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23న `రాధే శ్యామ్` టీజర్ విడుదల కానుంది.
`రాధే శ్యామ్`లో రెబల్ స్టార్ కృష్ణంరాజు, జయరామ్, భాగ్యశ్రీ, జగపతిబాబు, సచిన్ ఖేద్కర్, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సత్యన్, సాషా చెట్రి ముఖ్య పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించిన ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ ని యూవీ క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది.
Also Read