2022 సెకండాఫ్: రాశీ ఖన్నాదే హవా!
on Jun 27, 2022
ప్రస్తుతం చేతినిండా సినిమాలున్న కథానాయికల్లో రాశీ ఖన్నా ఒకరు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కలుపుకుని ఈ అమ్మడి చేతిలో అరడజను చిత్రాలున్నాయి. వీటిలో ఐదు సినిమాలు ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ కి రెడీ అయ్యాయి. జూలై మొదలుకుని నవంబర్ వరకు ఈ పంచచిత్రాల విడుదలకు ప్రణాళిక సిద్ధమైంది.
ఆ వివరాల్లోకి వెళితే.. గోపీచంద్ తో కలిసి రాశీ ఖన్నా నటించిన తెలుగు చిత్రం `పక్కా కమర్షియల్`. మారుతి రూపొందించిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా జూలై 1న రాబోతోంది. ఇక అదే నెలలో 22న నాగచైతన్య సరసన రాశి అభినయించిన `థాంక్ యూ` తెరపైకి వస్తోంది. విక్రమ్ కె. కుమార్ ఈ రొమాంటిక్ డ్రామాని రూపొందించాడు. ఆపై ఆగస్టు 18న ధనుష్ తో కలిసి రాశి యాక్ట్ చేసిన `తిరుచిత్రాంబళమ్` అనే తమిళ సినిమా విడుదల కానుంది. మిత్రన్ జవహార్ ఈ సినిమాకి కెప్టెన్.
అలాగే కార్తికి పెయిర్ గా రాశి ఖన్నా నటిస్తున్న కోలీవుడ్ ప్రాజెక్ట్ `సర్దార్` కూడా ఇదే క్యాలెండర్ ఇయర్ లో సిల్వర్ స్క్రీన్ పైకి వస్తోంది. పి.ఎస్. మిత్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ దీపావళి కానుకగా అక్టోబర్ లో రిలీజ్ కానుంది. అదేవిధంగా సిద్ధార్ధ్ మల్హోత్రాకి జోడీగా రాశి నటించిన హిందీ చిత్రం `యోధ` నవంబర్ 11న ఎంటర్టైన్ చేయనుంది. సాగర్ అంబ్రే, పుష్కర్ ఓళ ఈ యాక్షన్ థ్రిల్లర్ కి దర్శకులు. మరి.. 2022 సెకండాఫ్ లో రానున్న ఈ ఐదు చిత్రాలతో రాశి ఎలాంటి ఫలితాలను అందుకుంటుందో చూడాలి.