రానా పొలిటికల్ ఎంట్రీ..అనంతలో సభ
on Jan 4, 2017
తెలుగు చిత్రపరిశ్రమలోని పెద్ద కుటుంబాల్లో దగ్గుబాటి కుటుంబం ఒకటి..ఆ వంశంలోని మూడు తరాలు సినీ కళామతల్లి సేవకే అంకితమయ్యాయి. సినిమాతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ దగ్గుబాటి వారు ముందే ఉంటారు. దివంగత రామానాయుడు ఎంపీగా గెలిచి రాజకీయాల్లోనూ రాణించారు. తాజాగా ఆయన మనవడు రానా కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు..పార్టీ పటిష్టత కోసం తనవంతు కృషి చేయడం మొదలెట్టాడు..ఇందులో భాగంగానే ఏపీలోని అనంతపురం జిల్లాలో ప్రచారం నిర్వహించాడు..ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు అభిమానులు విచ్చేశారు. అయితే ఇదంతా నిజం కాదు..ఒక సినిమా కోసం..తేజ దర్శకత్వంలో రానా "నేనే రాజు నేనే మంత్రి" అనే సినిమాలో నటిస్తున్నాడు..ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ అనంతపురంలో జరుగుతోంది. ఫుల్ లెంగ్త్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో రానా సరసన కాజల్ నటిస్తోంది.