బాహుబలి` సిరీస్ తరువాత మళ్ళీ `లైగర్`తోనే!
on Dec 4, 2021
`బాహుబలి` సిరీస్ తో నటిగా మరోసారి మెస్మరైజ్ చేశారు సీనియర్ యాక్ట్రస్ రమ్యకృష్ణ. ఇందులో రాజమాత శివగామిగా రమ్య అభినయం.. ప్రేక్షకులను కట్టిపడేసింది. పాన్ - ఇండియా మూవీగా రిలీజైన ఈ సినిమాతో అన్ని భాషల్లోనూ ఫిదా చేశారు ఈ వెటరన్ యాక్ట్రస్.
ఇదిలా ఉంటే.. `బాహుబలి` సిరీస్ తరువాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ఇలా అన్ని ముఖ్య భాషల్లోనూ సినిమాలు చేసిన రమ్యకృష్ణ.. మళ్ళీ పాన్ - ఇండియా మూవీలో కనిపించిన సందర్భం లేదు. అయితే, త్వరలో ఆ ముచ్చట తీరనుంది. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న `లైగర్`తో అన్ని భాషల్లోనూ ఒకేసారి ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు రమ్యకృష్ణ. అంతేకాదు.. `బాహుబలి` సిరీస్ తరహాలో ఇందులోనూ శక్తిమంతమైన పాత్రలోనే కనిపించబోతున్నారని సమాచారం. మరి.. చాన్నాళ్ళ తరువాత చేస్తున్న ఈ పాన్ - ఇండియా మూవీతో రమ్యకృష్ణ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు వేచిచూడాల్సిందే.
కాగా, స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న `లైగర్`లో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే నాయికగా నటిస్తుండగా.. లెజండరీ బాక్సర్ మైక్ టైసన్ ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారు.
Also Read