పవన్ కల్యాణ్తో ఢీకొట్టనున్న రామ్!
on Oct 26, 2020
సెన్సేషనల్ బ్లాక్బస్టర్ చిత్రం 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత రామ్ హీరోగా చేసిన సినిమా ‘రెడ్'. కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై 'స్రవంతి' రవికిశోర్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కి విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిషోర్ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాం. ‘స్రవంతి’ మూవీస్లో రామ్తో చాలా మంచి సినిమాలు చేశాం. ఇదీ మరో మంచి సినిమా అవుతుంది. మణి శర్మ తొలిసారిగా మా సంస్థ లో పని చేశారు .
ఇదో సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కం లవ్ ఎంటర్ టైనర్. ఆద్యంతం ఎమోషన్స్ రక్తి కట్టిస్తాయి. కేవలం క్రైమ్ ఎలిమెంట్ మాత్రమే కాదు.. ఇందులో చక్కని లవ్ స్టోరి ఉంది. మదర్ సెంటిమెంట్.. ఎంటర్ టైన్ మెంట్ హైలైట్ గా నిలుస్తాయి.’’ అని తెలిపారు.
రామ్ మాట్లాడుతూ ‘‘నా 18వ సినిమా ‘రెడ్’. కిషోర్ దర్శకత్వంలో నాకిది మూడో సినిమా .ఫస్ట్ టైమ్ కెరీర్లో ఒక థ్రిల్లర్ చేశాను .మాస్ ఎలిమెంట్స్, క్లాస్ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి’’ అని చెప్పారు.
కిషోర్ తిరుమల మాట్లాడుతూ ‘‘రామ్గారితో స్రవంతి మూవీస్లో నేను చేసిన మూడో సినిమా ఇది . ‘రెడ్’ సినిమా కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని నమ్మకంగా చెబుతున్నా. కథ కొత్తగా ఉంటుంది. ట్రీట్మెంట్ కూడాకొత్తగా ఉంటుంది. ఇది థ్రిల్లర్ అయినప్పటికీ కమర్షియల్గా ఉంటుంది’’ అని అన్నారు.
నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ నాయికలుగా నటించిన ఈ సినిమాలో నాజర్ ఓ కీలక పాత్ర చేశారు. మణిశర్మ సంగీత దర్శకుడు.
కాగా సంక్రాంతికి 'రెడ్'ను రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించడంతో 'వకీల్ సాబ్'తో ఆ సినిమా పోటీకి వచ్చినట్లయింది. పవన్ కల్యాణ్ మూవీ 'వకీల్ సాబ్'ను సంక్రాంతికి తెచ్చేందుకు నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. నవంబర్లో పవన్కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. డిసెంబర్లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని పనులూ కంప్లీట్ చేయాలని చిత్ర బృందం పట్టుదలతో ఉంది.
Also Read