`భీమ్లా నాయక్`.. నటకిరీటీ సీరియస్ రోల్!
on Nov 30, 2021
2022 సంక్రాంతికి సందడి చేయనున్న బిగ్ టికెట్ ఫిల్మ్స్ లో `భీమ్లా నాయక్` ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి రానా మరో ప్రధాన పాత్రలో దర్శనమివ్వనున్నారు. సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో నటకిరీటీ రాజేంద్ర ప్రసాద్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. అంతేకాదు.. రాజకీయ నాయకుడిగా ఆయన పాత్ర ఉంటుందని, ఎంతో సీరియస్ గా సాగే ఈ పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నెవర్ సీన్ బిఫోర్ పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేయనున్నారని ఇన్ సైడ్ టాక్. మరి.. `భీమ్లా నాయక్` చిత్రంతో రాజేంద్ర ప్రసాద్ నటుడిగా ఎలాంటి గుర్తింపు పొందుతారో చూడాలి.
కాగా, సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం `అయ్యారే`లో రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో అలరించారు. మళ్ళీ పదేళ్ళ తరువాత ఈ ఇద్దరు జట్టుకట్టడం విశేషం.
Also Read