అంజనమ్మకు నాలుగో కొడుకుని.. పూనకంతో ఊగిపోయిన రచ్చ రవి!
on Jan 29, 2023
మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన బ్లాక్ బస్టర్ మూవీ 'వాల్తేరు వీరయ్య'. శృతిహాసన్ హీరోయిన్ గా, మాస్ మహారాజా రవితేజ కీలకపాత్రలో నటించిన ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ ని షేక్ చేసేంత కలెక్షన్స్ రాబట్టింది. రీసెంట్ గా వరంగల్ లో ఈ మూవీ సక్సెస్ మీట్ జరిగింది. ఈ మీట్ లో రచ్చ రవి రెచ్చిపోయాడు. పూనకాలు లోడింగ్ అన్న పదాన్ని స్టేజి మీద నిజం చేసాడు.."ఓరుగల్లు ముద్దు బిడ్డలారా ! నా చిరంజీవి అన్నయ్య తమ్ముళ్ళారా..ఒక్క సారి జై చిరంజీవ అనండి..అంజనమ్మ టీవీ చూస్తున్నావా...మా అందరి కోసం మెగాస్టార్ ని, పవర్ స్టార్ ని ఇచ్చావ్. ఈ టాలీవుడ్ లో మా బతుకులు మార్చడానికి టవర్ స్టార్ నాగబాబు అన్నని ఇచ్చావ్..మాకు అమ్మ చేపల కూర వండి పెట్టింది. అమ్మా నేను నీకు నాలుగో కొడుకుని ..ఈ మాటను నేను కంఫర్మ్ చేసాను. నేనేం ఆస్తి అడగడం లేదు..అన్నయ్యల వెనక ఉండే రచ్చ స్టార్ ని నేను. అన్నా నిన్ను చూద్దామని వచ్చాను.." అన్నాడు. అప్పుడు హోస్ట్ సుమ కలుగజేసుకొని "స్టేజ్ మీద ఉన్న అందరి బదులు నువ్వే మాట్లాడావు" అనడంతో.. "నువ్వు ముసలిదానివి కావు ఏమీ కావు.. నువ్వు ఎవ్వరికీ ఛాన్స్ ఇవ్వవు.. నా మాటలు నేను మాట్లాడా.. అందరికీ ఒక్కో మాట మాట్లాడే ఛాన్స్ ఇవ్వు " అంటూ ఇంకా స్పీచ్ పొడిగించేసరికి స్టేజ్ పైన ఉన్న టీమ్ అతని చేతిలోని మైక్ లాక్కుని థ్యాంక్యూ చెప్పారు. రవి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read