తెలుగు మహాసభల్లో మెగా ఉత్సాహం
on Dec 19, 2017
మెగా హీరోలకు జాలి, దయ, సోషల్ రెస్పాన్సిబిలిటీ పాళ్లు కాస్త ఎక్కువని ఫిలింనగర్లో తరచుగా వినిపించే మాట. తమను ఇంతటి వారిని చేసిన సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుంది అంటే.. ఏం చేయడానికైనా ఈ కుటుంబం ముందుంటుంది. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకుల ద్వారా మెగాస్టార్ చిరంజీవి తన మానవత్వాన్ని చాటుకోగా.. ఆయన బాటలోనే మిగిలిన మెగా హీరోలు కూడా నడుస్తున్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న తెలుగు మహాసభలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. వేడుకల్లో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి కవులు, కళాకారులు, సాహితీవేత్తలు తరలివచ్చారు.
ఎక్కడెక్కడి నుంచో.. ఎవరెవరో ఈ కార్యక్రమానికి వస్తుంటే.. హైదరాబాద్లో ఉన్న తాము సైలెంట్గా ఉండటం ఏంటా అనుకున్నారో ఏమో కానీ.. మెగా హీరోలు రంగంలోకి దూకారు. నాలగవ రోజు సభకు చిరంజీవి హాజరయ్యారు. అలాగే ఈ సభల్లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడేలా.. వివిధ కార్యక్రమాలను రూపొందించింది తెలంగాణ సర్కార్. దీనిలో భాగంగా టాలీవుడ్లోని కొంతమంది హీరోలతో ప్రత్యేక గీతాలు కూడా రూపొందించింది. తెలంగాణ గడ్డ విశిష్టతను తెలుపుతూ..హారీష్ శంకర్ దర్శకత్వంలో ఓ పాట తెరకెక్కింది. దీనిలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు హీరోలు, హీరోయిన్లు, రచయితలు నటించారు. ఇందులో మెగా వారసులు సాయిథరమ్ తేజ్, వరుణ్ తేజ్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ప్రజంట్ ఈ పాట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.