పట్టాలెక్కిన కాటమరాయుడు
on Sep 21, 2016

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' 'కాటమరాయుడు' గా నిర్మితమవుతున్న చిత్రం షూటింగ్ నేటినుంచి హైదరాబాద్ లో ప్రారంభమైంది. 'శృతి హాసన్' కథానాయికగా నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కిషోర్ కుమార్ పార్దసాని' (డాలి) దర్శకుడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 15 రోజులపాటు తొలి షెద్యూల్ జరుగుతుంది. ఈ షెద్యూల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు అలీ,అభినవ్ సింగ్,రావు రమేష్ లతో పాటు మరికొంతమంది పాల్గొంటారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ, సంగీతం: అనూప్ రూబెన్స్
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



