ఆకులో 20 ఐటమ్స్ వడ్డించారు!
on Oct 19, 2018
ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నది తెలుగులో ఓ సామెత. దీని అర్థం ఏంటంటే... సమాన స్థాయి కలిగిన వ్యక్తులు ఇద్దరు ఒక చోట ఇమడలేరు అని! ఏ ఇద్దరు స్టార్ హీరోయిన్లూ ఒక చోట ఇమడలేరని, ఇద్దరి మధ్య స్నేహం కుదరదని అంటుంటారు. కానీ, ఇక్కడ కుదిరింది. రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే మధ్య స్నేహం కుదిరింది. విజయ దశమి సందర్భంగా రకుల్ని తన ఇంటికి ఆహ్వానించింది పూజా హెగ్డే. ఫెస్టివల్ స్పెషల్ లంచ్ పెట్టింది. రకుల్ ఫ్యామిలీ ఢిల్లీలో సెటిల్ అయ్యింది. ఆమెకు హైదరాబాద్లో ఒక సొంత ఇల్లు కొనుక్కుంది. ప్రస్తుతం ఓ హిందీ సినిమా షూటింగ్ కోసం ముంబైలో వుంది. పూజా హెగ్డే సొంతూరు బెంగళూరు. అయితే... ఫ్యామిలీ అంతా ముంబైలో సెటిల్ అయ్యింది. విజయదశమికి ఇంటి దగ్గరే వున్నారు. రకుల్ కూడా ముంబైలో వున్నారని తెలుసుకుని తన ఇంటికి ఆహ్వానించారు. పండుగ భోజనంలో సుమారు 20 ఐటమ్స్ వడ్డించడంతో రకుల్ ఆశ్చర్యపోయారు. అన్నీ ఇష్టంగా తిని తరవాత వర్కవుట్స్ చేశారు.
ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబు, ప్రభాస్ సినిమాల్లో పూజా హెగ్డే నటిస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ సరసన నటించిన 'అరవింద సమేత వీరరాఘవ' విడుదలైంది. రకుల్ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఎన్టీఆర్ బయోపిక్ చేస్తుంది కానీ... అందులో అతిథి పాత్ర మాత్రమే. కొన్ని సన్నివేశాల్లో శ్రీదేవిగా కనిపిస్తుంది. రకుల్ అవకాశాలను పూజా ఎగరేసుకు వెళ్తోందని కొంతమంది కామెంట్ చేశారు. నిజం ఏంటో ఇద్దరికీ తెలుసు. ప్రస్తుతం పూజా హెగ్డే నటిస్తున్న హీరోల పక్కన రకుల్ ఎప్పుడో నటించేసింది. ఈ కామెంట్స్ పక్కనపెట్టి ఇద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు.
Also Read