అల్లు అర్జున్ కి ఆ అమ్మాయి దాదాపు ఫిక్స్...
on Jun 28, 2016
!
తమిళ చిత్రం "మాస్క్"తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డేను అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత నాగచైతన్య సరసన "ఒక లైలా కోసం" అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది, అనంతరం వరుణ్ తేజ్ సరసన "ముకుంద" సినిమాలో నటించి మొట్టమొదటి హిట్ ను అందుకోంది. ఆ తర్వాత అమ్మడికి టాలీవుడ్ లో బోలెడు ఆఫర్లు వచ్చినప్పటికీ.. బాలీవుడ్ కు పయనమై, ఏకంగా హృతిక్ రోషన్ సరసన నటించే అవకాశం సొంతం చేసుకొంది. ఆమె నటించిన బాలీవుడ్ సినిమా "మోహెన్ జెదారో" చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమవుతోంది. దాంతో.. పూజా మళ్ళీ టాలీవుడ్ పై దృష్టి సారించింది. ఈ సొగసరిని అల్లు అర్జున్ తాజా సినిమా కోసం ఎంపిక చేశారని తెలుస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజూ నిర్మాతగా తెరకెక్కనున్న సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా ఎంపిక చేశారట. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వకపోయినప్పటికీ.. అమ్మడి ఎంపిక దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్లే అని సమాచారం!