కొత్త లుక్లో పవన్ కళ్యాణ్... అందుకేనా?
on Jan 27, 2023
పవన్ కళ్యాణ్ త్వరలో రెండు రీమేక్ చిత్రాలు చేయనున్నారు. అందులో ఒకటి కోలీవుడ్ లో విజయ్ నటించన తేరీ కాగా రెండోది నటుడు, దర్శకుడు సముద్రఖని తానే నటిస్తూ దర్శకత్వం వహించిన వినోదాయ సిత్తం. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆయన ఈ మధ్య కోర మీసాలు పెంచి దర్శనమిస్తూ ఉన్నారు. తాజాగా ఆయన రాజకీయ యాత్ర చేయడం కోసం తన వారాహి వాహనానికి కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి తీసుకుని వచ్చారు. కొండగట్టును పవన్ పర్యటించే సందర్భంగా పవన్ కళ్యాణ్ సింపుల్ గా మీసాలు ట్రిమ్ చేసి డీసెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. అంటే పవన్ నిజంగానే రీమేక్ కోసం కొత్తగా మేకోవర్ అవుతున్నారు అనిపిస్తుంది. ఇక ప్రస్తుతం పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కోలీవుడ్ లో విజయ్ నటించిన తేరీ రీమేక్ను తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ గా చేయనున్నారు.
ఇక సముద్రఖని నటించి దర్శకత్వం వహించిన వినోదాయ సిత్తం సినిమా కూడా ఒప్పుకున్నారు. కాగా వినోదాయ సిత్తం రీమేకును కేవలం ఒకటిన్నర నుంచి రెండు నెలల లోపు పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఇందులో సాయి ధరమ్ తేజ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్నట్టు సమాచారం. పవన్ ఇమేజ్ కి వినోదాయసిత్తం సరిగ్గా సూట్ అవుతుందని భావించిన త్రివిక్రమ్ స్వయంగా స్క్రిప్ట్ విషయాలు చూసుకుంటున్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ను అతి త్వరలోనే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే హరిహర వీరమల్లు కంటే ముందే వినోదాయ సిత్తం రీమేక్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఇక పవన్ సాహూ సుజిత్ తో పాటు గోపీచంద్ మలినేని, సురేందర్ రెడ్డి వంటి దర్శకులను కూడా లైన్లో పెడుతున్నారు. ఈయన ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవైపు బస్సు యాత్ర చేస్తూ పవన్ ఇన్ని సినిమాల షూటింగ్లను ఎలా పూర్తి చేస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల వరకు హరిహర వీరమల్లు షూటింగ్లో పవన్ పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ షూటింగ్ కార్యక్రమాలు హైదరాబాదులో జరిగాయి. ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. త్వరలోనే దీన్ని కూడా పవన్ పూర్తి చేయనున్నాడని తెలుస్తోంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
