పవన్ భార్యకు ఆ పిచ్చ బాగా ముదిరిందట..!
on Aug 10, 2016
పవన్ కల్యాణ్తో కలసి ఉన్నప్పటి కంటే విడిపోయిన తరవాతే... పబ్లిసిటీ పెంచుకొంది రేణు దేశాయ్. ఎప్పుడూ ఏదో ఒక విషయంలో ట్వీట్లు చేసి జనాల దృష్టి ఆకర్షిస్తోంది. వాటిలో పవన్ గురించిన కామెంట్లే ఎక్కువ. అయితే ఈ మధ్య ఆ యావ బాగా ఎక్కువైపోయింది. అయిన దానికీ, కాని దానికీ ట్వీట్లు చేసి ఏదోలా జనం దృష్టిని తన వైపుకు తిప్పుకోవాలని చూస్తోంది. ఓ సారి ఆసుపత్రుల తీరుపై ధ్వజం ఎత్తింది రేణు. అందులో కాస్తో కూస్తో మీనింగ్ ఉన్నా.. తాజాగా అమెజాన్ పై చేసిన ట్వీట్లు చూస్తే మరీ 'చిల్లర వ్యవహారం'లా అనిపిస్తోంది.
క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లపై అమెజాన్ ఏజెంట్లు చాలా చీప్గా బిహేవ్ చేస్తున్నారని, సరైనంత చిల్లర తమ దగ్గర ఉంచుకోవడం లేదని, ఏమైనా అడిగితే... చాలా ఘోరంగా మాట్లాడుతున్నారని రేణు ఫిర్యాదు చేస్తోంది. నిజంగా ఇది చిల్లర వ్యవహారమే. క్యాష్ ఆన్ డెలివరీ టైమ్లోనే కస్టమర్ తగినంత చిల్లర తన దగ్గర ఉంచుకోవాలి. ఆ నెపం.. కొరియర్ బోయ్పై వేస్తే ఎలా?? అందుకే... రేణూ ట్వీట్లని ఎటకారం చేస్తూ.. జనాలు రీ ట్వీట్లు కూడా చేస్తున్నారు. ఇకనైనా... ట్వీట్ల యావ కాస్త తగ్గించుకొంటే మంచిది రేణూ. లేదంటే ఇలానే పరువు పోతుంది.