ENGLISH | TELUGU  

27న లాంచ్ అవుతున్న పీకే-క్రిష్ ఫిల్మ్!

on Jan 21, 2020

 

రెండేళ్ల విరామంతో పవన్ కల్యాణ్ మళ్లీ సినిమా సెట్స్‌పైకి వచ్చిన విషయం తెలిసిందే. 'అజ్ఞాతవాసి' తర్వాత బాలీవుడ్ మూవీ 'పింక్' తెలుగు రీమేక్‌లో నటిస్తున్న ఆయన జనవరి 20న ఆ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. కాగా ఆయన మరో సినిమాకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేషనల్ అవార్డ్ విన్నర్ క్రిష్ డైరెక్షన్‌లో చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఈ కాంబినేషన్ మూవీని శ్రీ సూర్యా మూవీస్ అధినేత ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. దీని షూటింగ్ ఈనెల 27న లాంఛనంగా మొదలవుతుందని సమాచారం. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమాని క్రిష్ రూపొందించనున్నారు.

'గమ్యం' వంటి చక్కని సినిమాతో డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టిన క్రిష్.. 'వేదం', 'కృష్ణం వందే జగద్గురుం', 'కంచె', 'గౌతమిపుత్ర శాతకర్ణి', హిందీలో 'మణికర్ణిక' వంటి చిత్రాలు రూపొందించి టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అయితే 2019 ఆయనకు చేదు అనుభవాన్నిచ్చింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఆయన రూపొందించిన రెండు భాగాల ఎన్టీఆర్ బయోపిక్ - 'యన్.టి.ఆర్: కథానాయకుడు', 'యన్.టి.ఆర్: మహానాయకుడు' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. 'మణికర్ణిక' చివరి దశలో ఆయనను తప్పించి కంగనా రనౌత్ స్వయంగా కొన్ని సన్నివేశాలకు డైరెక్ట్ చెయ్యడం వివాదాన్ని సృష్టించింది. ఈ చేదు జ్ఞాపకాల్ని పక్కనపెట్టి, తన తదుపరి సినిమా మీద దృష్టిపెట్టిన క్రిష్ చెప్పిన స్క్రిప్ట్ పవన్ కల్యాణ్‌కు నచ్చింది. ఇప్పుడది సెట్స్ మీదకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. 

పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్‌పై పీకే ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ పీపుల్ కూడా అమితాసక్తి వ్యక్తం చేస్తున్నారు. పీకేను క్రిష్ కొత్త డైమెన్షన్‌లో ప్రెజెంట్ చేస్తారని వాళ్లు ఆశిస్తున్నారు. ఇలా ఒకేసారి రెండు సినిమాలు చేస్తూ పవన్ కల్యాణ్ మార్కెట్లో హీట్ పెంచుతున్నారు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.