ENGLISH | TELUGU  

అఖండ 2 కోసం రంగంలోకి దిగిన మిశ్రా సోదరులు.. బాలయ్యకి  దైవం అనుకూలం 

on Oct 13, 2025

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)కి దైవ భాష సంస్కృతం పట్ల ఉన్న పట్టు అపారం. ఈ విషయంలో ఎవరకి డౌట్స్ ఉన్నా, బాలకృష్ణ ఇప్పటి వరకు పాల్గొన్న కొన్ని సినిమా ఫంక్షన్స్ లోను, పబ్లిక్ మీటింగ్స్ లో, ఇంటర్వూస్ లో దైవ భాష సంస్కృతం గురించి చాలా చక్కగా వివరించిన సందర్భాలు ఉన్నాయి. పురాణాలకి సంబంధించిన ఎన్నో శ్లోకాల్ని అవలీలగా కూడా చెప్పగలరు. బహుశా అందుకునేమో అఖండ లో శివుణ్ణి ఆరాధించే అఘోరగా బాలయ్య  దైవానికి సంబంధించిన డైలాగ్స్ చెప్తుంటే, థియేటర్స్ లోని ప్రేక్షకులు మొత్తం పూనకంతో ఉగిపోయినంత పని చేసారు.


ఇప్పుడు అఖండ 2(Akhanda 2)కి అంతకు రెట్టింపు పూనకాలతో ఊగనున్నారు. సంస్కృత శ్లోకాలు, వేదమంత్రాలు చెప్పడంలో నిపుణులైన పండిట్ శ్రవణ్ మిశ్రా(Pandit Shravan Mishra),పండిట్ అతుల్ మిశ్రా(Pandit atul mishra)సోదర ద్వయాన్ని మేకర్స్ అఖండ 2 కోసం రంగంలోకి దించారు. ఈ మేరకు థమన్(Thaman)అధికారకంగా వెల్లడి చేసాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి. అన్న దమ్ములైన శ్రవణ్ మిశ్రా, అతుల్ మిశ్రా సంస్కృత శ్లోకాలని పఠించడంలో నిష్ణాతులు. ఆ రంగంలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఎంతో మందిలో భక్తి భావాన్ని రెట్టింపు చేసారు. సదరు శ్లోకాలని వాళ్ళు గుక్క తిప్పుకోకుండా చెప్తుంటే మన రోమాలు నిక్కబొడుచుకోవడంతో పాటు ఎంతో తన్మయత్వం చెందుతాం. ఈ ఇద్దరి పేర్ల ముందు పండిట్ అని వచ్చిందంటే ఎంత ప్రతిభావంతులో కూడా అర్ధం చేసుకోవచ్చు. రేపు థియేటర్ లో శివ స్తుతుడైన అఘోర గా బాలయ్య చెప్పబోయే సంస్కృత శ్లోకాలు, ఈ ఇద్దరి నోటి నుంచే రానున్నాయి, మరి అఘోర గా బాలయ్య డైలాగ్ చెప్తేనే థియేటర్ లోని ప్రేక్షకులు మొత్తం శివ తాండవంతో ఊగిపోయారు. మరి రేపు ఈ ఇద్దరి గాత్రంలో బాలయ్య సంసృత పఠనాలు చెప్తు చేసే పెర్ ఫార్మెన్స్ కి, థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా తోడైతే   థియేటర్ లలో పరిస్థితి ఏ రకంగా ఉంటుందో చెప్పక్కర్లేదు.

ఇక ఈ విషయంతో మేకర్స్ అఖండ 2 ని  ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో చెప్పాల్సిన పని లేదు. బాలయ్య కెరీర్ లోనే  అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న అఖండ 2 ని  బాలకృష్ణ చిన్న కూతురు తేజశ్వని తో కలిసి ఆచంట రామ్, ఆచంట గోపీనాద్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5 న పాన్ ఇండియాలోని అన్ని భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. సంయుక్త మీనన్(Samyutha Menon) కథానాయకి కాగా వర్సటైల్ యాక్టర్ ఆది పినిశెట్టి(Aadhi Pinisetty)ప్రతినాయకుడుగా చేస్తున్నాడు. బోయపాటి శ్రీను(Boyapati srinu)ప్రస్తుతం శర వేగంగా చిత్రీకరణ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

 

 

 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.