ENGLISH | TELUGU  

సాయి పల్లవిని పక్కన పెట్టేశారేంటి?

on Aug 15, 2023

శేఖర్ కమ్ముల సినిమాలలో హీరోయిన్ పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అందుకే ఆయన సినిమాల్లో నటించిన హీరోయిన్ లకు కాస్త ఎక్కువగానే పేరు వస్తుంది. తెలుగు ప్రేక్షకులకు సాయి పల్లవిని దగ్గర చేసిన ఘనత కమ్ములకే దక్కుతుంది. సాయి పల్లవి నటించిన మొదటి సినిమా 'ఫిదా'కి కమ్ములే దర్శకుడు. ఆ చిత్రంలో ఆమెని చూపించిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లవ్ స్టోరీ'లో కూడా సాయి పల్లవే హీరోయిన్. ఇలా వరుసగా రెండు సినిమాల్లో ఆమెను హీరోయిన్ గా తీసుకున్న కమ్ముల.. తన తాజా చిత్రం కోసం మాత్రం ఆమెని పక్కన పెట్టేశారు.

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటిస్తున్న 51వ సినిమాకి కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు. హీరో ధనుష్ తో పాటు దర్శకుడు కమ్ములతో రష్మికకు ఇదే మొదటి సినిమా కావడం విశేషం. 'పుష్ప'తో పాన్ ఇండియా హిట్ అందుకున్న రష్మిక చేతిలో ప్రస్తుతం 'పుష్ప-2', 'యానిమల్' వంటి క్రేజీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఇక ఇప్పుడు 'D51' కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో సౌత్ తో పాటు నార్త్ లోనూ గుర్తింపు ఉన్న రష్మికను చిత్ర బృందం ఎంపిక చేసినట్లు సమాచారం.

గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన రెండు వరుస సినిమాలు 'ఆనంద్', 'గోదావరి' లలో కమలిని ముఖర్జీ హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత కమ్ముల డైరెక్షన్ లో 'హ్యాపీ డేస్' రాగా, అందులో మాత్రం తమన్నా హీరోయిన్ గా నటించింది. అయితే ఆ చిత్రంలో కమలిని ప్రత్యేక పాత్రలో మెరిసి అలరించింది. ఇప్పుడు సాయి పల్లవి విషయంలో కూడా కమ్ముల అదే ఫాలో అవుతారేమో చూడాలి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.