మళ్లీ సేమ్ హీరోయిన్.. మ్యాటరేంటో..?
on Feb 11, 2018
హీరో నితన్, హీరోయిన్ మేఘా ఆకాశ్ ఇద్దరూ కలిసి గతంలో లై సినిమాలో నటించిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతుంది. అదే "చల్ మోహన్ రంగ". లిరిసిస్ట్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో 25వ సినిమాగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు ఈరోజు. ఈ ఫస్ట్ లుక్ లు నితిన్, హీరోయిన్ మేఘా ఆకాశ్ గంతులేస్తూ కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ , శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగాఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి . త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కథ అందించాడు.
మరి ఇక్కడి వరకూ అంతా బాగానే ఉంది. ఇక్కడే అసలు డౌట్లు మొదలవుతున్నాయి. "లై" సినిమా చేస్తున్నప్పుడే మేఘా ఆకాశ్తో నితిన్ పీకల్లోతు ప్రేమలో ఉన్నాడంటూ గుసగుసలాడుకున్నారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఈ మ్యాటర్ లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ అదే హీరోయిన్ తో మరో సినిమాలో నటిస్తున్నాడు. మరి ఇంతకు ముందు వచ్చిన వార్తల్లో నిజముందా అన్న అనుమానాలు మళ్లీ ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి. మళ్లీ మేఘా ఆకాశ్ కే ఛాన్స్ ఇచ్చాడంటే మ్యాటర్ ఏదో ఉండి ఉంటుందిలే అని మళ్లీ గుసగుసలు మొదలయ్యాయి. మరి ఈసారైన ఈ విషయంలో క్లారిటీ వస్తుందో..? లేదో..? చూద్దాం...