36 దేశాలు 6400 కిలోమీటర్లు..ప్రాణాలతో వస్తామో లేదో పూరి నే చెప్పాలి
on May 6, 2025
'డబుల్ ఇస్మార్ట్' పరాజయంతో పూరి జగన్నాధ్(Puri Jagannadh)ఈసారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకు తగ్గట్టుగానే అందరి అంచనాలని తలకిందులు చేస్తు 'మక్కల్ సెల్వన్ 'విజయసేతుపతి'(Vijay sethupathi)తో తన నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో నిర్మాణం జరుపుకోబోతున్న ఈ మూవీని పూరి కనక్ట్స్, ఛార్మీ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.
పూరి జగన్నాధ్ చాలా కాలం నుంచి సోషల్ మీడియా వేదికగా 'పూరి మ్యూజింగ్స్' అనే ప్రోగామ్ చేస్తు పలు అంశాలపై మాట్లాడుతుంటాడు. ఈ కోవలనే తాజాగా 'సిల్క్ రోడ్' (Silk Road)అనే అంశంపై మాట్లాడుతు 'పూర్వం చైనా నుంచి యూరప్ దాకా ఒక కనెక్టింగ్ రూట్ ఉండేది. దానిపేరే సిల్క్ రూట్. ఆరు వేల నాలుగువందల కిలోమీటర్ల దూరంతో ముప్పై ఆరు దేశాలని కలుపుతుంది. ఈ రూట్లో వెళ్తే తిరిగి ప్రాణాలతో వస్తామో లేదో ఎవరికీ తెలియదు. చైనా, మంగోలియా, ఇండియా, పాకిస్థాన్, ఇరాన్, ఇరాక్, ఈజిప్టు, ఇటలీ ఇలా అన్ని దేశాలు కనక్ట్ అయ్యుంటాయి. గోబీ, తక్లమకన్ లాంటి ఎడారులు దాటుకుంటు, ఇసుక తుఫానుల మధ్య ప్రయాణం చేయాలి. ఒంటెలు, గుర్రాలు లేకుండా ఎవరు ట్రావెల్ చేయలేరు.
ఇండియా(India)చైనా(China)నుంచి కూడా కొన్ని రకాల వస్తువులు, జంతువులు ఎక్స్ పోర్ట్ అయ్యేవి. చెంగిజ్ ఖాన్ ఎంపైర్ చేతిలో ఈ రూట్ ఉండేది. వాళ్ళే దాదాగిరి చేసేవారు. ప్రపంచ యాత్రికుడిగా ప్రసిద్ధి చెందిన 'మార్క్ పోలో' ఈ రూటులోనే పేపర్, కోల్ అమ్మేవాడు. వ్యాపారం చేయాలంటే కత్తి పట్టాల్సిందే. పదిహేను వందల సంవత్సరాల పాటు ప్రపంచమంతా ఈ రూట్ నే ఉపయోగించింది. బిజినెస్ చేయడానికి అంద రు 'మాలి' అనే లాంగ్వేజ్ మాట్లాడేవారు. ఇప్పుడు కూడా కొందరు ట్రావెలర్స్ పూర్వంలాగే నడుచుకుంటూ సిల్క్ రూట్ లో ట్రావెల్ చేస్తుంటారు. ఇస్లాం,బుద్ధిజం,క్రిస్టియానిటీ వంటివి ఒక చోటు నుంచి ఒక చోటుకి కూడా వ్యాప్తించాయని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చాడు. ఇక పూరి చెప్పిన ఈ మాటలతో 'సిల్క్ రోడ్' కథనే విజయ్ సేతుపతి తో తెరకెక్కిస్తున్నాడేమో అనే ప్రచారం జరుగుతుంది. ఒక వేళ అదే జరిగితే పాన్ ఇండియా లెవల్లో సరికొత్త రికార్డులు నమోదయినట్టే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
