నేను డ్రగ్స్ కొనలేదు, వాడలేదు.. స్పందించిన నాగ్ హీరోయిన్ !
on Sep 22, 2020
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో దియా మీర్జా పేరు తెరపైకి వచ్చింది. త్వరలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఆమెకు సమన్లు జారీ చేయవచ్చని కొన్ని ఛానళ్లు కథనాలు ప్రసారం చేశాయి. ఎన్సీబీ ఇంటరాగేషన్ లో దియా మీర్జా రిక్వెస్ట్ మేరకు 2019లో డ్రగ్స్ సరఫరా చేశానని, దియాకి ఆమె మేనేజర్ డ్రగ్స్ సప్లై చేస్తారని డ్రగ్ పెడ్లర్ అనూజ్ కేశ్వాని చెప్పినట్టు మీడియా కథనాల సారాంశం. ఒకటి రెండుసార్లు అనూజ్ కేశ్వానిని ఆమె కలిసినట్టు పేర్కొన్నారు. ఈ వార్తలను దియా మీర్జా తీవ్రంగా ఖండించారు.
దురుద్దేశాలతో కూడిన నిరాధారమైన, తప్పుడు వార్తను తీవ్రంగా ఖండిస్తున్నానని సోషల్ మీడియాలో దియా మీర్జా ఒక పోస్ట్ చేశారు. కొన్నేళ్లుగా కష్టపడి నిర్మించుకున్న తన కెరీర్ మీద ఇటువంటి పనికిమాలిన రిపోర్టింగ్ ప్రత్యక్షంగా ప్రభావం చూపిస్తుందని అందులో ఆమె పేర్కొన్నారు. తానెప్పుడూ డ్రగ్స్ లేదా నిషేధిత పదార్థాలను కొనలేదనీ, తీసుకోలేదని దియా మీర్జా స్పష్టం చేశారు. భారతదేశ చట్టాలను గౌరవించే దేశ పౌరురాలిగా తనకు అందుబాటులో ఉన్న న్యాయపరమైన మార్గంలో సమస్యను పరిష్కారించాలని అనుకుంటున్నట్టు దియా మీర్జా తెలిపారు. మద్దతు ఇస్తున్న ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పారు.
Also Read