బ్రేకింగ్: బాలీవుడ్ డ్రగ్ కేసులో నమ్రత, దీపిక పడుకోనేలకు ఎన్సీబీ సమన్లు!
on Sep 23, 2020
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో తాజా పరిణామాల్లో భాగంగా, బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దీపికా పదుకొనే, రకుల్ప్రీత్ సింగ్, సిమోన్ ఖంబట్టా, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్, నమ్రతా శిరోద్కర్, కరిష్మా ప్రకాష్, శ్రుతి మోడీతో సహా మొత్తం 8 మందికి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) బుధవారం సమన్లు జారీ చేసింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, శ్రుతి, సిమోన్, రకుల్ప్రీత్లను రేపు (గురువారం), దీపిక, కరిష్మాను సెప్టెంబర్ 25న, సారా అలీ ఖాన్, శ్రద్ధా కపూర్లను సెప్టెంబర్ 26న విచారణ కోసం పిలిచారు. నమ్రతను ప్రశ్నించడానికి ఎప్పుడు పిలిచారనేది వెల్లడి కావాల్సి ఉంది. అయితే బాలీవుడ్ డ్రగ్ కేసులో నమ్రత పేరు రావడం, ఇప్పుడు ఆమెకు సమన్లు జారీ చేశారని కూడా వార్తలు రావడం సంచలనంగా మారింది. దీనిపై టాలీవుడ్ వర్గాల్లో తీవ్రంగా చర్చలు నడుస్తున్నాయి.
మరోవైపు ముంబై జైలులో జ్యుడిషియల్ కస్టడీలో 14 రోజులు గడిపాక బెయిల్ కోసం రియా చక్రవర్తి రెండోసారి అభ్యర్థించింది. ఎన్సీబీ తనను మంత్రగత్తెను వేటాడినట్లు వేటాడుతోందని అందులో ఆరోపించింది. సుశాంత్ సింగ్ తన డ్రగ్ తీసుకొనే అలవాటును కొనసాగించడానికి తన సన్నిహితులను ఉపయోగించుకున్నాడని కూడా ఆమె ఆరోపించింది.
Also Read