వర్మని మార్చిన నయీం
on Aug 23, 2016
రోమ్ తగలడిపోతుంటే పిడేలు వాయించే నీరో చక్రవర్తి టైపు... రాంగోపాల్ వర్మ. ప్రపంచంలో ఏ చిన్న విషయం జరిగినా.. దాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడంలో సమర్థుడు రాంగోపాల్ వర్మ. తాజ్పై ఎటాక్ జరిగి అక్కడ ఉగ్రవాదులు విధ్వంసం సృష్టిస్తే.. దాన్ని సినిమాగా మలని సూపర్ హిట్ కొట్టాడు వర్మ. ఇప్పుడు వర్మ దృష్టి నయీంపై పడింది. నయీం చేసిన అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తుంటే నేర ప్రపంచమే నిర్వెరపోతోంది. వాటిపై వర్మ కూడా ఇప్పుడు ఆసక్తి పెంచుకొంటున్నాడు. నయీం చరిత్ర మొత్తం తెలుసుకొన్న వర్మ ఇప్పుడు నయీంపై ఓ సినిమా తీస్తున్నాడట. ఒకటి కాదు.. రెండు కాదు మూడు భాగాలుగా ఈ సినిమాని మలిచే ప్రయత్నం చేస్తున్నాడట. రక్తచరిత్రని రెండు భాగాలకు పరిమితం చేసిన వర్మ.. నయీం చరిత్ర చెప్పాలంటే మూడు సినిమాలుగా మలచాల్సిందే అంటున్నాడు. ప్రస్తుతం నయీం పాత్రకు సరిపడ నటుడి కోసం అన్వేషిస్తున్నాడట. వంగవీటి మోహనరంగ కథని సినిమాగా మలిచే ప్రయత్నంలో ఉన్న వర్మ.. ఆ సినిమా పూర్తయిన వెంటనే నయీం కథ తీస్తాడన్నమాట. తెలుగులో ఇక సినిమాలే చేయను అని పేద్ద స్టేట్మెంట్ ఇచ్చిన వర్మని నయీం ఇలా మార్చేశాడన్నమాట.