బాలయ్య యాగం మొదలైంది
on Sep 7, 2016
నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్ట్రీజియస్ 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి`. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో చిత్రీకరణ జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ, హేమామాలిని, శ్రేయాశరన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సెప్టెంబర్ 6న రాజసూయయాగం చిత్రీకరణను ప్రారంభించారు. అఖండ భారతాన్ని ఏకతాటిపై తేవడానికి పురాణాలలో ధర్మరాజు, చారిత్రాత్మకంగా శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి మాత్రమే ఈ యాగాన్ని నిర్వహించారు. ఈ రాజసూయ యాగ సమయంలోనే శాతకర్ణి తన తల్లి గౌతమి పేరును తన పేరు ముందు ఉంచుకుని తన పేరుని గౌతమిపుత్ర శాతకర్ణిగా మార్చుకున్నారు. ఆ రోజునే కొత్త యుగానికి ఆది ఉగాది అని ప్రకటించారు.
అప్పటి నుండి అదే రోజున ఉగాది పండుగను నిర్వహిస్తూ వస్తున్నారు. యాదృచ్చికంగా బాలకృష్ణ కూడా తన తల్లి పేరుతో ఉన్న బసవతారం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కు ఛైర్మన్గా బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహిస్తూ, ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు గర్వపడేలా చేస్తున్నారు. అలాగే రాజసూయం షూటింగ్ ప్రారంభమైన నిన్న (సెప్టెంబర్6న) బాలకృష్ణ తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టిన నక్షత్రం స్వాతి నక్షత్రం కావడం, అలాగే నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ పుట్టినరోజు కావడం విశేషం. ఇన్ని ప్రత్యేకతలతో కూడిన రోజునే గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో రాజసూయ యాగం చిత్రీకరణ ప్రారభమవడం దైవ సంకల్పమే కాక స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీస్సులు అని చెప్పవచ్చు.