15 రోజులు కోమాలో ముమైత్!
on Feb 25, 2021
సూపర్ స్టార్ మహేశ్ నటించిన `పోకిరి` ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసి స్టార్ని చేసింది. ఈ మూవీతో మహేశ్ స్టార్డమ్ ఓ రేంజ్కి వెళ్లింది. అయితే ఇదే సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. షఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.." అంటూ ముమైత్ఖాన్ తనదైన స్టైల్లో మెస్మరైజ్ చేస్తూ తన ఒంపు సొంపులతో ఆకట్టుకుంది.
`పోకిరి` సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఈ పాట కూడా ముమైత్కు అంతే పాపులారిటీని తీసుకొచ్చింది. ఆ తరువాత టాలీవుడ్లో స్పెషల్ సాంగ్ అంటే ముమైత్ వుండాలి.. ముమైతే చేయాలి.. అనేంతగా స్టార్ డమ్ని సొంతం చేసుకుంది. అలాంటి ముమైత్ ఖాన్ ఒకానొక దశలో 15 రోజుల పాటు కోమాలోకి వెళ్లిపోయిందట. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. ఈటీవీలో స్టార్ కమెడియన్ అలీ `ఆలీతో సరదాగా` అంటూ ఓ కార్యక్రమం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పాల్గొన్న ముమైత్ ఇప్పటిదాకా బయటపెట్టని అప్పటి విషయాన్ని వెల్లడించి అందరికీ షాకిచ్చింది.
ఈ ఘటన 2016లో జరిగిందట. 2015లో బాలకృష్ణ నటించిన `డిక్టేటర్` చిత్రం కోసం ఓ ప్రత్యేకగీతంలో నటించింది ముమైత్ . దీనికి సంబంధించిన సాంగ్ షూట్ అదే ఇయర్ డిసెంబర్ 27న పూర్తయిందట. ఆ తరువాత పుట్టిన రోజు, న్యూ ఇయర్ వేడుకల కోసం గోవా వెళ్లి తిరిగొచ్చిన ముమైత్ డిసెంబర్ 31న ఇంట్లో స్నానం చేసి అద్దం ముందు నిలుచుని వుండగా 'దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే' చిత్రంలోని పాట గుర్తొచ్చి పరధ్యానంలో కాలు జారి కింద పడిపోయిందట. పక్కనే వున్న మంచం కొన తాకడంతో తలకు గాయమైందట.
ఆ తరువాత లేచి చూస్తే ఆసుపత్రిలో వుందట ముమైత్. అప్పటికే తాను కోమాలోకి వెళ్లి 15 రోజులైందని తెలిసి షాకయిందట. నాకు బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. ఇప్పటికీ నా బ్రెయిన్లో 9 టైటానియం తీగలున్నాయి. వైద్యులు నేను బ్రతికేందుకు 20 శాతం మాత్రమే ఛాన్స్ వుందని చెప్పారు" అని తెలిపింది ముమైత్ఖాన్.
Also Read